ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 12న జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారు. జనవరి 12న జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం మాత్రమే కాకుండా ఇప్పటికే విడుదల చేసిన 20 రకాల నోటిఫికేషన్స్ పరీక్ష తేదీలు కూడా ప్రకటిస్తారు.
జాబ్ క్యాలెండర్ ప్రకటనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం క్రింది విధంగా ఉంది.
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
జాబ్ క్యాలెండర్ లో ప్రకటించబోయే ఉద్యోగాలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 12వ తేదీన ప్రకటించే జాబ్ క్యాలెండర్ ద్వారా 18 శాఖల్లో 866 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది . ఖాళీలు వివరాలు శాఖల వారీగా క్రింది విధంగా ఉన్నాయి.
- అటవీ శాఖలో 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు , 691 బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు, 13 డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, 10 తానేదార్ పోస్టులు భర్తీ చేస్తారు.
- వ్యవసాయ శాఖలో 10 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తారు.
- దేవదాయ శాఖలో 7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
- మున్సిపల్ శాఖలో 2 జూనియర్ అకౌంట్స్ కేటగిరి పోస్టులు , 3 సీనియర్ అకౌంటెంట్ క్యాటగిరి పోస్టులు మరియు 4 జూనియర్ అకౌంటెంట్ క్యాటగిరి పోస్టులు భర్తీ చేస్తారు.
- ఇంటర్మీడియట్ విద్యలో 2 గ్రంథకు పాలకుల పోస్టులు భర్తీ చేస్తారు
- ఉద్యానవన శాఖలో రెండు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తారు.
- మత్స్య శాఖలో 3 అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ చేస్తారు.
- భూగర్భ నీటిపారుదల శాఖలో 4 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తారు.
- 7 జిల్లా సైనిక్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తారు.
- వీటితోపాటు రవాణా శాఖలో AMVI పోస్టులు, జైల్లో శాఖలో జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్, గనుల శాఖలో రాయల్టీ ఇన్స్పెక్టర్, బీసీ సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, దివ్యాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్ , ఫ్యాక్టరీ సర్వీసెస్ లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వంటి పోస్టులు కూడా భర్తీ చేయడం జరుగుతుంది.
- ఈ ఉద్యోగాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో 16,347 టీచర్ పోస్టులను DSC నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
20 నోటిఫికేషన్ లకు పరీక్ష తేదీలు ప్రకటన :
- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే విడుదల చేసిన 20 నోటిఫికేషన్ లకు సంబంధించిన పరీక్ష తేదీలను కూడా జాబ్ క్యాలెండర్ సందర్భంగా ప్రకటించడం జరుగుతుంది. మార్చి చివరివారం నుండి జూన్ చివరివారం మధ్యలో వీటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
- గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ తర్వాత నిర్వహిస్తారు.
- గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహిస్తారు. ఇప్పటికే ఏపీపీఎస్సీ దీనిపై ఒక ప్రకటన కూడా చేసింది.
- వీటితో పాటు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు జూన్ లో నిర్వహించవచ్చు.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 AP మంత్రుల ఫేషిల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here