ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు ఎప్పుడంటే.. | APPSC Group 2 Mains Result2025 | AP Group 2 Mains Results update

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ విజయవంతంగా నిర్వహించింది. మెయిన్స్ పరీక్షలో పేపర్-1 మరియు పేపర్-2 ను ఒకేరోజు నిర్వహించారు. 

ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 92,250 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో 86,459 మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్షకు 92 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష నిర్వహించిన తరువాత ఏపీపీఎస్సీ ఆన్సర్ ‘ కీ ‘ కూడా విడుదల చేసింది. ఆన్సర్’ కీ ‘ పైన అభ్యంతరాలను తెలిపేందుకు ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఏపీపీఎస్సీ సమయం ఇచ్చింది. అభ్యంతరాలు స్వీకరణకు చివరి తేదీ పూర్తి అయ్యి నెలరోజులకు పైగానే అయినప్పటికీ ఏపీపీఎస్సీ ఇప్పటి వరకు మెయిన్స్ ఫలితాలను విడుదల చేయలేదు.

పరీక్ష జరిగిన రెండు, మూడు వారాల్లోనే పరీక్ష ఫలితాలు విడుదల చేయాల్సినప్పటికీ ఇంతవరకు ఫలితాలు విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ లో రోస్టర్ తప్పులు ఉన్నాయన్న వివాదం నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత వచ్చిన తర్వాత ఫలితాలు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. 

కటాఫ్ మార్కుల వివరాలు : 

ఏపీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పేపర్-1 , పేపర్-2 లలో వచ్చిన ప్రశ్నలను చూసిన నిపుణులు పేపర్-1 కటాఫ్ 115 , paper-2 కటాఫ్ 110 ఉంటుందని అంచనా వేశారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లోనే విడుదల చేస్తుంది..

🏹 Appsc Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *