APPSC Group 2 Update | APPSC Group 2 Recruitment 2023 Latest News today | APPSC Latest News Today

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ 900 పోస్టులతో విడుదల కాబోతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చే వారంలోపు విడుదల చేయబోతున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యుడైన పరీగే సుధీర్ గారు తన X (ట్విట్టర్) ఖాతా ద్వారా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడైన పరిగే సుధీర్ గారు తన ట్విట్టర్ ఖాతాలో ఈ బుధవారం నాటికి అన్ని శాఖల నుండి ఖాళీలకు సంబంధించిన సమాచారం ఏపీపీఎస్సీకి చేరుతుందని , అలాగే జీవో 77 అమలుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయని ఈ ట్వీట్ ద్వారానే తెలియజేశారు. ఈ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి అలాగే ఈ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రయత్నించిన గౌతమ్ సవాంగ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఈ ఉద్యోగాలకు అనుమతిస్తూ గతంలో ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది.

గతంలో 508 గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం , కొద్దిరోజుల క్రితం 212 గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలైన జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయడానికి అనుమతించింది. అంతేకాకుండా గత నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానీ పోస్టులను కూడా ఈసారి విడుదల చేయబోయే నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయబోతున్నారు. కాబట్టి మొత్తంగా 900 వరకు గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీకి ఈసారి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గతంలో పరిగె సుధీర్ గారు ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను 2024లో ఫిబ్రవరిలో లేదా మార్చి మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు ఒక ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది.

గ్రూప్ 2 ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో విడుదల చేసిన నూతన సిలబస్ ప్రకారం ఈ ఉద్యోగాల ఎంపికలో రెండు దశలు ఉంటాయి. 

మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రిలిమినరీ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. రెండో దశలో మెయిన్స్ పరీక్ష 300 మార్కులకు నిర్వహిస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష లో అర్హత సాధించిన వారు మాత్రమే మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులవుతారు.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *