ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పదో తరగతి పూర్తి చేసి AP RGUKT IIIT ల్లో ప్రవేశాలు కోసం ప్రయత్నిస్తున్న వారికి మరో అవకాశం. తాజాగా జరిగిన మొదటి విడత కౌన్సెలింగ్ లో 598 సీట్లు మిగిలిపోయాయి. AP RGUKT IIIT 2nd Phase Counselling Dates కోసం చివరి వరకు చదవండి.
రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత 598 సీట్లు మిగిలిపోయాయి అని అధికారులు వెల్లడించారు. రెండవ విడత కౌన్సిలింగ్ ద్వారా మిగిలిపోయిన 598 సీట్లు భర్తీ చేయనున్నారు.
IIIT ల్లో మిగిలిపోయిన సీట్లు :
తాజగా అధికారులు వెల్లడించిన వివరాలు ప్రకారం కౌన్సెలింగ్ అనంతరం నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 598 సీట్లు మిగిలాయి. ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1,010 సీట్లు ఉండగా, నూజువీడులో 139, ఇడుపులపాయలో 132, శ్రీకాకుళంలో 144, ఒంగోలులో అత్యధికంగా 183 సీట్లు మిగిలిపోయాయి.
AP RGUKT IIIT 2nd Phase Counselling Dates :
ఈ సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 14 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
🏹 AP గ్రామీణ అభివృద్ధి సంస్థలో డిగ్రీ విద్యార్హతతో ఉద్యోగాలు – Click here
AP RGUKT IIIT సీట్లు మిగిలిపోవడానికి కారణం :
కౌన్సెలింగ్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా 15 రోజులు ఆలస్యం కావడం వల్ల చాలా మంది పాలిటెక్నిక్, ఇంటర్ కాలేజీల్లో చేరిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ కారణం వలన సీట్లు మిగిలిపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
AP RGUKT IIIT క్లాసులు ప్రారంభ తేదీ :
మొదటి విడతలో సీట్లు పొందిన వారికి ఈ నెల 14 నుండి తరగతులు ప్రారంభమవుతాయని రిజిస్ట్రార్ తెలిపారు.
🏹 Official Website – Click here