Annadata Sukhibhava Scheme E-KYC Status | అన్నదాత సుఖీభవ పథకం ఈ-కేవైసీ అందరికీ అవసరం లేదు..

Annadata Sukhibhava Scheme E-KYC Status

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. జూన్ 20వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం (Annadata Sukhibhava Scheme) ద్వారా రైతుల అకౌంట్లో 7,000/- జమ చేయనున్నారు. అయితే ఈ పథకం ద్వారా రైతులు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా E-KYC చేయాలి అనే నిబంధన పెట్టారు.

కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు ప్రకారం రైతులు అందరూ ఈ కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఈ కేవైసి కి సంబంధించి తాజా సమాచారం తెలియాలి అంటే ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి .

🏹 రాష్ట్రంలో మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు 15,000/- – Click here

Annadata Sukhibava Scheme E-KyC :

అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం అర్హులు అందరూ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్న 45.65 లక్షల మందిలో 44.19 లక్షల మంది రైతుల వివరాలను ఆటో అప్డేట్ చేసినట్టు తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. కానీ వివరాలు సరిగ్గా లేని 1.45 లక్షల మంది రైతులు మాత్రం దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ కేవైసీ అవసరమైన రైతుల లిస్ట్ కూడా రైతు సేవా కేంద్రాలకు ఇప్పటికే పంపించడం జరిగింది. కాబట్టి వీరు కూడా ఈ కేవైసీ పూర్తి చేస్తే జూన్ 20వ తేదీన రైతుల అకౌంట్లో డబ్బులు జమవుతాయి.

Annadata Sukhibava Scheme Status :

అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ ను రైతులు సొంతంగానే తెలుసుకోవచ్చు.. దీనికోసం https://annadathasukhibhava.ap.gov.in/ అనే వెబ్సైట్ లో ఆధార్ నెంబర్ వివరాలు నమోదు చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు.

Annadata Sukhibava Scheme ద్వారా మొదటి విడతలో జరిగే లబ్ది :

అన్నదాత సుఖీభవ పథకం మరియు పిఎం కిసాన్ పథకంలో భాగంగా రైతుల అకౌంట్లో మొత్తం ప్రభుత్వం 20,000/- జమ చేయనున్నారు. ఇందులో మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 5,000/- మరియు కేంద్ర ప్రభుత్వ వాటా 2,000/- కలిపి మొత్తం 7,000/- రూపాయలను ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్ లో జూన్ 20వ తేదీన జమ చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!