జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనం గా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
ఇందులో భాగంగా ప్రతీ గ్రామ, వార్డు సచివాలయంలో కూడా యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. అలానే జూన్ 21న విశాఖపట్నం లో యోగా డే కార్యక్రమం ను రికార్డ్ స్థాయిలో నిర్వహించేందుకు గాను యోగాంధ్ర – 2025 పేరు మీదుగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న యోగాంధ్ర – 2025 కార్యక్రమం కి సంబంధించి మరింత సమాచారం కొరకు ఆర్టికల్ ను చివర వరకు చదవగలరు.
🔥 యోగాంధ్ర – 2025 & విస్తృత అవగాహన :
ఆంధ్రప్రదేశ్ లో యోగాంధ్ర పేరిట నెల రోజుల పాటు యోగా అవగాహన కొరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
యోగా మన దేశానికి వారసత్వ సంపద , ఇది మన భారత దేశ జీవన విధానం లో భాగంగా వస్తుంది. ప్రధానమంత్రి మోదీ గారి కృషి వలన యోగా కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. మోడీ గారి కృషి వలన డిసెంబర్ 2014 లో ఐక్య రాజ్య సమితి సర్వ సభ్య సమావేశం లో ప్రపంచమంతా యోగా దినోత్సవం నిర్వహించాలి అనే తీర్మానం చేశారని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు.
🏹 పెరుగుతున్న కరోనా కేసులు – ప్రజలకు వైద్య శాఖ సూచనలు – Click here
🔥 జూన్ 21న విశాఖలో 5 లక్షల మందితో యోగా కార్యక్రమం :
జూన్ 21, 2025 తేదీన విశాఖ లోని ఆర్కె బీచ్ నుండి భోగాపురం వరకు కనీసం 5 లక్షల మంది ప్రజలతో ఉదయం 7 నుండి 8 గంటల మధ్య రికార్డ్ స్థాయిలో యోగా కార్యక్రమం ను నిర్వహించనున్నారు.
అలానే రాష్ట్రం లో 2 కోట్ల మందికి తగ్గకుండా యోగా కార్యక్రమం లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాల పర్యవేక్షణ కొరకు మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు.
🔥 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా యోగాంధ్ర – 2025 సర్వే :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో గ్రామ, వార్డు సచివాలయంల ద్వారా యోగా పై అవగాహన కొరకు యోగాంధ్ర – 2025 సర్వే ప్రారంభించారు.
ఇందులో భాగంగా సచివాలయం సిబ్బంది ప్రతీ ఇంటిని సందర్శించి, యోగా డే లో పాల్గొంటారా లేదా అన్నది తెలుసుకుంటారు. అలానే యోగా డే లో వారు ఎక్కడ పాల్గొంటారు అనేది అడుగుతారు. ప్రజలు వారి దగ్గరలో గల గ్రామ, వార్డు సచివాలయం వద్ద లేదా విశాఖపట్నం లో నిర్వహించే ప్రపంచ యోగా దినోత్సవ సంబరాల వద్ద లేదా మరేదైనా ఇతర ప్రదేశాల వద్ద ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.