తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రవీంద్ర భారతిలో విడుదల చేశారు. ఈసారి ఈ ఫలితాలను సబ్జెక్టుల వారిగా మార్కులు మరియు గ్రేడ్లు ఇచ్చారు. కనీసం మార్కులు వస్తే పాస్ అని, కనీసం మార్కులు రాకపోతే ఫెయిల్ అని మార్కుల మెమోలో ఇవ్వడం జరిగింది.
మొత్తం ఐదు లక్షలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. 92.78% విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరంతో పోలిస్తే 1.47% అధికంగా ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
🏹 ఫలితాలను విద్యార్థులు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ నుండి తెలుసుకోవచ్చు.
✅ Click here to Check Your Results