ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో ఉన్న హై కోర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నుండి 50 పోస్టులతో జూనియర్ డివిజన్ లో సివిల్ జడ్జ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 40 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 10 పోస్టులను ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేస్తారు.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 20వ తేదీ నుండి మార్చి 17వ తేదీలకు సబ్మిట్ చేయాలి.
అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 16వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహిస్తారు.
- ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , అప్లై విధానము ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగానికి త్వరగా అప్లై చేయండి.
✅ AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
🏹 ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు దిగువన ఇవ్వబడినవి…
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్) పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 మొత్తం పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా 50 పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో 40 పోస్టులు డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా, 10 పోస్టులు ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
✅ ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here
🔥 అర్హతలు :
- డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అప్లై చేయడానికి “ లా “ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 అప్లికేషన్ మరియు పరీక్ష ఫీజు :
- OC, BC, EWS అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 1500/- చెల్లించాలి.
- SC, ST, PwBD అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 750/- చెల్లించాలి.
🔥 గరిష్ట వయస్సు :
- 01-02-2025 నాటికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
🔥 వయసులో సడలింపు వివరాలు :
- ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది. అనగా
- SC, ST, BC, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 20వ తేదీ నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ 17-03-2025
🔥 స్క్రీనింగ్ టెస్ట్ తేదీ :
- ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్ ఏప్రిల్ 16వ తేదీన నిర్వహిస్తారు.
🔥 జీతం ఎంత ఉంటుంది :
- ఎంపికైన వారికి 77,840/- నుండి 1,36,520/- వరకు పే స్కేల్ ప్రకారం జీతము ఇస్తారు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- ఎంపిక ప్రక్రియలో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), రాత పరీక్ష, వైవా వాయిస్ టెస్ట్ నిర్వహించి ఫైనల్ మెరిట్ లిస్ట్ 1:3 నిష్పత్తిలో విడుదల చేస్తారు.
🔥 స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే పరీక్ష కేంద్రాలు :
- గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి , విజయవాడ , విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం :
- అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానములో అప్లై చేయాలి.
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి.
✅ Download Notification & Application
🔥 Official Website – Click here
🔥 గమనిక :
- అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.