NIACL Administrative Officer Notification 2025 | Age, syllabus, Qualification, Salary, Apply Process

NIACL Administrative Officer Recruitment 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ముంబై ప్రధాన కేంద్రంగా గల లీడింగ్ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ది న్యూ ఇండియా ఎస్యురెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) నుండి 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరలిస్ట్స్& స్పెషలిస్ట్స్ ) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ కి అవసరం అగు అర్హతలు ఏమిటి ? ఎంత వయస్సు లోపు గలవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ? దరఖాస్తు చేయు విధానం ఏమటి ? అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఏ విధంగా ఎంపిక చేస్తారు ? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥NIACL AO ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) సంస్థ నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥భర్తీ చేయబోయే మొత్తం ఖాళీల సంఖ్య :

  • అన్ని విభాగాలలో కలిపి మొత్తం 550 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

AP దేవాదాయ శాఖలో డిగ్రీ అర్హత తో ఉద్యోగాలు – Click here

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ( జనరలిస్ట్స్& స్పెషలిస్ట్స్ ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగా
  • రిస్క్ ఇంజనీర్స్ – 50
  • ఆటోమొబైల్ ఇంజనీర్స్ – 75
  • లీగల్ స్పెషలిస్ట్స్ – 50
  • అకౌంట్స్ స్పెషలిస్ట్స్ – 20
  • ఏవో ( హెల్త్) – 50
  • ఐటి స్పెషలిస్ట్ – 25
  • బిజినెస్ ఎనలైట్స్ – 75
  • కంపెనీ సెక్రటరీ -02
  • యాక్చురియల్ స్పెషలిస్ట్స్ – 05
  • జనరలిస్ట్స్ – 193

🔥 NIACL AO ఉద్యోగాల విద్యార్హతలు :

  • జనరలిస్ట్స్ : జనరలిస్ట్స్ విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నా ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ / యూనివర్సిటీ నుండి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • ఎస్సీ / ఎస్టి / దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు తో ఉత్తీర్ణత సాధించాలి.
  • స్పెషలిస్ట్స్ : స్పెషలిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి క్రింది విద్యార్హత కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకుగాను అవకాశం కల్పించారు. అవి :

విద్యార్హతలకు సంబంధించి ఫలితాలు 01/08/2025 లోగా వచ్చి వుండాలి.

🔥 వయస్సు :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 21 సంవత్సరాల నుండ 30 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు .
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/08/2025 ను కట్ ఆఫ్ తేదీగా పరిగణించారు.
  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు , ఎక్స్ సర్వీస్మెన్ వారికి ఐదు సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు చేయు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
  • అభ్యర్థులు ఏదైనా ఒక విభాగంలో గల ఉద్యోగాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటికంటే ఎక్కువ విభాగాలలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోరాదు.

🔥 ఎంపిక విధానం :

  • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ , మెయిన్స్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • ప్రిలిమినరీ వ్రాత పరీక్ష : ప్రిలిమినరీ వ్రాత పరీక్ష వంద మార్కులు గాను నిర్వహిస్తారు. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 30 ప్రశ్నలకు 30 మార్కులు , రీజనింగ్ ఎబిలిటీ 35 పశ్నలకు 35 మార్కులు , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలకు 35 మార్కులు కేటాయించారు. అయితే ఒక్కొక్క విభాగానికి 20 నిముషాలు సమయం , మొత్తం పరీక్ష కు ఒక గంట సమయం కేటాయించారు.
  • మెయిన్స్ ఎగ్జామినేషన్: మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఆబ్జెక్టివ్ పరీక్షతో పాటుగా డిస్క్రిప్టివ్ పరీక్ష కూడా నిర్వహిస్తారు.
  • మెయిన్స్ పరీక్ష (ఆబ్జెక్టివ్ )200 మార్కులకు గాను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా రీజనింగ్ , ఇంగ్లీష్ లాంగ్వేజ్ , జనరల్ అవేర్నెస్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలు ఉంటాయి. స్పెషలిస్ట్స్ వారికి సంబంధిత స్పెషలైజేషన్ ప్రశ్నలు కూడా పరీక్ష లో ఇస్తారు.
  • మెయిన్స్ పరీక్షలో భాగంగా డిస్క్రిప్టివ్ పరీక్ష ను 30 మార్కులకు 30 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి లెటర్ రైటింగ్ కి 10 మార్కులు & ఎస్సే రైటింగ్ కి 20 మార్కులు కేటాయించారు.
  • మెయిన్స్ పరీక్ష నిర్వహించిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షలలో తప్పుగా సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 1/4 వంతు నేటి మార్కింగ్ విధానం కలదు.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టి , దివ్యాంగులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • ఇతర అభ్యర్థులు 850 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

🔥పరీక్షా కేంద్రాలు :

  • దేశంలోని అన్ని రాష్ట్రాలలో గల ప్రముఖ నగరాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  • తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు / విజయవాడ , కాకినాడ , కర్నూలు , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , విశాఖపట్నం , విజయనగరం , అనంతపూర్ , కడప లోనూ… తెలంగాణ లోని హైదరాబాద్ , కరీంనగర్ , ఖమ్మం , వరంగల్ , నిజామాబాద్ లో ప్రిలిమినరీ వ్రాత పరీక్ష నిర్వహిస్తారు.
  • మెయిన్స్ వ్రాత పరీక్ష ను ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ / గుంటూరు, విశాఖపట్నం లో తెలంగాణ లోని హైదరాబాద్ లో నిర్వహిస్తారు.

🔥 జీత భత్యాలు:

  • ఈ ఉద్యోగానికి ఎంపిక అయిన వారికి 50,925 రూపాయల బేసిక్ పే తో అన్ని అలవెన్స్ లు కలిపి 90,000 రూపాయల జీతం లభిస్తుంది.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఫీజు పేమెంట్ చేయడానికి ప్రారంభ తేదీ : 07/08/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఫీజు పేమెంట్ చేయడానికి చివరి తేదీ : 30/08/2025
  • ఫేజ్ – 01 ఆన్లైన్ పరీక్ష నిర్వహణ ( ఆబ్జెక్టివ్) : 14/09/2025
  • ఫేజ్ – 02 ఆన్లైన్ పరీక్ష నిర్వహణ ( ఆబ్జెక్టివ్ & డిస్క్రిప్టివ్ ) : 29/10/2025

👉 Click here for official website

👉 Click here for Notification

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *