ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఎంపిక జాబితా విడుదల తేదీ ఇదే | AP IIIT Selection List Released Date @https://www.rgukt.in/

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పూర్తి చేసి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం అప్లై చేసుకుని ఎంపిక జాబితా (AP IIIT Selection List) కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రిపుల్ ఐటిల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి గాను ఎంపిక జాబితాను ఈనెల 23వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ట్రిపుల్ ఐటీల్లో మొత్తం ఎన్ని సీట్లు ? (AP RGUKT IIIT Selection List Date)

రాష్ట్రంలో శ్రీకాకుళం, ఒంగోలు, నూజివీడు, ఇడుపులపాయ లో ఉన్న ట్రిపుల్ ఐటీల్లో మొత్తం 4,400 సీట్లు ఉన్నాయి. కానీ 50,541 మంది విద్యార్థులు ఈ ప్రవేశాల కోసం అప్లై చేసుకోవడం జరిగింది. ట్రిపుల్

ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఎలా ఎంపిక చేస్తారు ? ((AP IIIT Selection List Process)

ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం అప్లై చేసుకున్న విద్యార్థులను పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారి జాబితాను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తారు.

AP లో 5 రోజులు ముందే రేషన్ పంపిణీ – Click here

ట్రిపుల్ ఐటీ ఎంపిక జాబితా ఎలా చూడాలి ? (How to Download AP IIIT Selection List)

యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://www.rgukt.in/ నుండి ఎంపికైన విద్యార్థులు జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక జాబితా విడుదల చేసిన తర్వాత కౌన్సిలింగ్ మరియు తరగతులు ప్రారంభం తేదీలు కూడా ప్రకటిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!