ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు అన్ని డిజిటల్ గా అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు ఏవైనా సంక్షేమ పథకాలకు అప్లై చేయాలి అంటే సచివాలయాలకు వెళ్లి అప్లై చేయవచ్చు.. కుల ధ్రువీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, పెన్షన్లు, IB అడంగల్ ఇలా వివిధ రకాల సేవలు సచివాలయాల ద్వారా లేదా మీసేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనేక సేవలు వాట్సాప్ ద్వారా కూడా అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే..
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు వంటివి మరింత సులభంగా ప్రజలకు చేర్చాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో డిజిటల్ లక్ష్మి అనే పథకానికి శ్రీకారం చుడుతుంది.
డిజిటల్ లక్ష్మి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 10,000 కియోస్క్ సెంటర్లను ఏర్పాటు చేయబోతుంది. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు వీటిని నిర్వహించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.

AP Digital Lakshmi Scheme Details :
పట్టణ స్వయం సహాయక సంఘాల్లో డిగ్రీ చదివిన మహిళలకు ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుంది. దీని ద్వారా డిగ్రీ చదివిన స్వయం సహాయక సంఘాల మహిళలు ద్వారా డిజిటల్ సేవలను ప్రజలకు ప్రభుత్వం అందించనుంది. డిజిటల్ లక్ష్మి గా ఎంపికైన వారు ప్రజలకు సంక్షేమ పథకాలు కు అప్లై చేయడానికి సహాయపడతారు.
AP Digital Lakshmi Scheme Qualification (డిజిటల్ లక్ష్మి పథకానికి అర్హతలు) :
పట్టణ ప్రాంతాల్లో ఉండే స్వయం సహాయక సంఘాల్లో డిగ్రీ చదివిన మహిళలను రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ లక్ష్మీ పథకానికి ఎంపిక చేస్తుంది.
డిజిటల్ లక్ష్మి గా ఎంతమందికి అవకాశం ఇస్తారు ?
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 10,000 కియోస్క్ లను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. కాబట్టి పదివేల మందికి డిజిటల్ లక్ష్మి గా అవకాశం ఇస్తారు.. అయితే ముందుగా 4000 మందిని నియమిస్తారు.
విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, విజయవాడ, తిరుపతి, అనంతపురం , కడప, కర్నూలు, నెల్లూరు లలో ముందుగా ప్రారంభిస్తారు. తరువాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
AP Digital Lakshmi Scheme Services (డిజిటల్ లక్ష్మీ ద్వారా అందించే సేవలు) :
డిజిటల్ లక్ష్మి ద్వారా ప్రజలు వివిధ సంక్షేమ పథకాలకు అప్లై చేయవచ్చు. అంతేకాకుండా ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లులు వంటి వివిధ రకాల సేవలు పొందవచ్చు. ప్రారంభంలో 20 రకాల సేవలతో ప్రారంభించి 200 సేవలు డిజిటల్ లక్ష్మి ద్వారా అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
🏹 AP Outsourcing Jobs Recruitment 2025 – Click here
డిజిటల్ లక్ష్మి పథకానికి ఎలా అప్లై చేయాలి ? (How to Apply Digital Lakshmi Scheme) :
మీరు ఈ పథకం ద్వారా డిజిటల్ లక్ష్మిగా పనిచేయాలి అంటే మీ స్వయం సహాయక సంఘాల గ్రూపు లీడర్లను లేదా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (MEPMA) వారిని సంప్రదించవచ్చు.
ఇలాంటి వివిధ రకాల ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం మీకు మేము వాట్సాప్ లో పంపిస్తాం. దీనికోసం మీరు క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి వెంటనే మా వాట్సాప్ గ్రూపులో అవ్వండి.