ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా గల తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వం జూన్ నెల లోనే తల్లికి వందనం , అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుంది అని ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే తల్లికి వందనం పథకం పొందాలి అనుకుంటే లబ్దిదారులు ఈ క్రింది అంశాలు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.
లబ్ధిదారులు ఈ పథకం పొందేందుకు గాను పరిశీలించుకోవాల్సిన అంశాలు గురించి అధికారులు నుండి విడుదల అయిన ఆదేశాలును ఈ ఆర్టికల్ లో తెలియచేయడం జరిగింది.
🔥జూన్ నెల లోనే తల్లికి వందనం పథకం :
- తల్లికి వందనం పథకం ను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల లోనే అమలు చేయనుంది.
- రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకం భావిస్తుంది.
- ఒక తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ పథకం ద్వారా లబ్ది చేకూరిస్తామని గతంలోనే తెలిపిన సంగతి తెలిసిందే.
- ఈ పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి 15,000/- రూపాయలు చొప్పున తల్లుల ఖాతాలలో జమ చేయనున్నారు.
ప్రతిరోజు వివిధ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు మీ మొబైల్ కి రావాలి అంటే మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.
🔥మరికొద్ది రోజులలో సచివాలయాలకు తల్లికి వందనం అర్హులు & అనర్హులు జాబితా ::
- ఈ పథకానికి సంబంధించి అర్హులు మరియు అనర్హులు జాబితాను రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజులలో విడుదల చేయనుంది.
- ఇందులో భాగంగా అనర్హులు జాబితాను ఏ కారణం చేత వారు అనర్హులు గా ఉన్నారో కూడా తెలియచేయనున్నారు.
- అర్హత కలిగి ఉండి అనర్హత జాబితాలో పేర్లు ఉంటే వారికి గ్రీవెన్స్ పెట్టుకోవటానికి అవకాశం కూడా కల్పిస్తారు.
🔥 తల్లికి వందనం పథకం లబ్ధిదారులు ఈ అంశాలను ఒకసారి చెక్ చేసుకోండి :
- తల్లికి వందనం పథకానికి సంబంధించి లబ్దిదారులు కొన్ని అంశాలను ముందుగానే పరిశీలించుకోవాలి అని అధికారులు తెలియచేశారు.
- ఇందులో భాగంగా లబ్ది దారులు ఈ పథకానికి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ను మరియు NPCI Status ను Check చేసుకోవాలి అని ప్రజల్ని కోరారు.
- తల్లికి వందనం పథకం అమలు దృశ్యా ఈ క్రింది విషయాలను నిర్ధారించుకోవాలి.
- ఈ పథకం ద్వారా లబ్ది పొందాలి అనుకుంటున్న తల్లులు మరియు విద్యార్థులు హౌస్ హోల్డ్ డేటా బేస్ లో నమోదు అయి వుండాలి.
- తల్లికి సంబంధించి EKYC ను తప్పనిసరిగా పూర్తి చేసుకొని వుండాలి , EKYC నమోదు కాకుంటే వారికి ఈ పథకం యొక్క లబ్ది చేకూరదు.
- తల్లి యొక్క బ్యాంకు ఖాతా ఆక్టివ్ గా వుండాలి మరియు NPCI లింక్ అయి వుండాలి.
ఈ పథకానికి సంబంధించిన అర్హత కలిగిన వారు తప్పనిసరిగా పై మూడు అంశాలను పరిశీలించుకోవాల్సి ఉంది ఇందులో ఏవైనా సందేహాలు ఉంటే మీ గ్రామ లేదా వార్డు సచివాలయాలను సంప్రదించవచ్చు. బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింక్ అనగా NPCI లింకింగ్ కొరకు మీ యొక్క బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించాలి.