భారత ప్రభుత్వ సంస్థ , మినీ రత్న కేటగిరీ -1 పరిధిలో గల సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి వివిధ పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 APSRTC లో ఖాళీలు భర్తీ – Click here
🏹 ITBP లో కానిస్టేబుల్ & SI ఉద్యోగాలు – Click here
🏹 ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మిన్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 23
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- డిప్యూటీ మేనేజర్ ( ఐటి ) – అప్లికేషన్ డెవలపర్
- డిప్యూటీ మేనేజర్ ( ఐటి ) – సైబర్ సెక్యూరిటీ
- డిప్యూటీ మేనేజర్ ( ఐటి ) – ఓపెన్ సోర్సు అప్లికేషన్ డెవలపర్
- అసిస్టెంట్ మేనేజర్ (F & A )
- అసిస్టెంట్ మేనేజర్ ( HR )
- అసిస్టెంట్ మేనేజర్ ( మెటీరియల్స్ మేనేజ్మెంట్)
- అసిస్టెంట్ మేనేజర్ ( ఐటీ)
- అసిస్టెంట్ మేనేజర్ ( లీగల్ )
🔥 విద్యార్హత :
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలలో మాస్టర్స్ డిగ్రీ / MCA / B.E / B.Tech / B.Com వంటి అర్హతల తో పాటుగా డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 3 సంవత్సరాల అనుభవం అవసరం
🔥 గరిష్ఠ వయస్సు :
- డిప్యూటీ మేనేజర్ పోస్ట్ లకి 35 సంవత్సరాలు ,
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30 సంవత్సరాలు గరిష్ట వయస్సు గా నిర్ధారించారు.
- వయస్సు నిర్ధారణకు 24/11/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
- ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥 దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ / EWS / OBC అభ్యర్థులు 600/- రూపాయలు
- ఎస్సీ / ఎస్టీ / PWD అభ్యర్థులు 200 రూపాయలు చెల్లించాలి.
🔥 జీతం :
- డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 50,000/- రూపాయల నుండి 1,60,000/- రూపాయలు
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 40,000/- రూపాయల నుండి 1,40,000/- రూపాయలు జీతం లభిస్తుంది
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను ఆన్లైన్ వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక చేస్తారు.
- ఆన్లైన్ పరీక్ష కి 75 శాతం మార్కుల వెయిటేజీ & ఇంటర్వ్యూ కి 25 శాతం మార్కుల వెయిట్అజ్ కేటాయించారు.
- ప్రొఫెషనల్ నాలెడ్జ్ ,జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ , లాజికల్ రీజనింగ్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టు లపై ప్రశ్నలు ఇస్తారు.
- 150 మార్కులకు 120 ప్రశ్నలు వుంటాయి.
🔥 పరీక్ష కేంద్రాలు :
- ఢిల్లీ , నోయిడా , గురుగ్రాం, ఫరేయాబాద్ , హైదరాబాద్ , కొలకత్తా , ముంబై , భోపాల్
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 25/10/2024
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది :24/11/2024 ( 05:30 PM)
👉 Click here for official website