ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రం లో ఉపాధ్యాయుల భర్తీ కొరకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి , పరీక్షలు నిర్వహిస్తుంది. అలానే తల్లికి వందనం పథకం ను కూడా జూన్ నెల లోనే అమలు చేయనున్నారు. అలానే విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించి , పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ లలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్ధులకు షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వనున్నారు.
స్కూల్స్ ప్రారంభం అయ్యే తేదీ జూన్ 12 వ తేదీన విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరిట విద్యా సామాగ్రి అందజేయనున్నారు.
షైనింగ్ స్టార్స్ అవార్డ్ లకు ఎవరు అర్హులు ? ఎప్పుడు ఈ అవార్డులు ఇస్తారు ? అన్న పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ Join Our what’s app Channel – Click here
🔥 షైనింగ్ స్టార్స్ అవార్డులుకు ఎవరు అర్హులు ?
- ఇటీవల విడుదల అయిన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ఉత్తమ పలితాలు సాధించిన విద్యార్థులు ఈ పథకం కి అర్హులు
- ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు లో చదువుకున్న విద్యార్థులు కూడా ఈ అవార్డ్ ను పొందవచ్చు.
- పదవ తరగతిలో 500 మార్కులకు పైగా మార్కులు వచ్చి వుండాలి.
- ఇంటర్మీడియట్ లో 830 మార్కులకు పైగా వచ్చి వుండాలి.
🔥షైనింగ్ స్టార్స్ అవార్డులు లో భాగంగా పొందేవి :
- షైనింగ్ స్టార్స్ అవార్డ్ లో భాగంగా విద్యార్థులకు 20,000/- రూపాయల నగదు తో పాటు ప్రశంసా పత్రం (Certificate of Appreciation) మరియు మెడల్ 🥇 అందచేస్తారు.
🔥 షైనింగ్ స్టార్స్ అవార్డులు కొరకు ఎంపిక విధానం:
- షైనింగ్ స్టార్స్ అవార్డ్ కొరకు 500 మార్కులకు పైగా వచ్చిన 10 వ తరగతి విద్యార్థులను మండలానికి 06 గురు చొప్పున ఎంపిక చేస్తారు. ఇందులో OC – 02 , BC – 02 , SC – 01 , ST – 01.
- ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి 830 పైగా మార్కులను పొందిన 36 మందిని జిల్లా ప్రాధిపతికన ఎంపిక చేస్తారు.
🔥 షైనింగ్ స్టార్స్ అవార్డులు ను ఎప్పుడు ఇస్తారు ? :
- ఈ అవార్డ్ లను జూన్ 09 వ తేదీన జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఇంచార్జి మంత్రి గారు యొక్క అద్వర్యంలో అందజేస్తారు.