ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలులో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలోనే అమలు చేయనుంది.
1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల తల్లుల అకౌంట్లో ప్రతి సంవత్సరం 15,000/- చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 15,000/- చొప్పున విద్యార్థి తల్లి అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది.
రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం అయ్యే లోపు అనగా జూన్ 15వ తేదీ లోపు తల్లులు అకౌంట్ లో నగదు జమ చేయనున్నారు. ఈ పథకం అమలు తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవల ప్రకటించడం జరిగింది.
🏹 తల్లికి వందనం పథకం అర్హతలు (Thalliki Vandhanam Scheme Details) :
- ఆంధ్రప్రదేశ్ కి చెందినవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉండాలి
- తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి.
- విద్యార్థి కనీసం 75% హాజరు కలిగి ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోపు ఉండాలి.
🏹 తల్లి వందనం పథకానికి అర్హత ఉన్నవారు ఇలా తప్పనిసరిగా చేయాలి :
- తల్లికి వందనం పథకానికి అర్హులైన విద్యార్థుల తల్లులు తమ బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ నంబర్ తో పాటు NPCI తో తప్పనిసరిగా లింక్ చేసుకొని ఉండాలి. జూన్ 5వ తేదీ లోపు ఇలా చేస్తేనే మీ అకౌంట్లోకి పథకం డబ్బులు వస్తాయి.
- దీనికోసం మీరు బ్యాంక్, పోస్టల్, సచివాలయం సిబ్బందిని సంప్రదించండి.
🏹 ఇలాంటి పథకాల సమాచారం ప్రతిరోజు మీ వాట్సాప్ కి రావాలి అంటే క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అవ్వండి..