ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూపర్ సిక్స్ పథకాలలో ప్రధాన పథకం అయిన తల్లికి వందనం పథకం (Talliki Vandhanam) అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక G.O విడుదల చేసింది. ఈ G.O లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం 2025 – 26 నుండి తల్లికి వందనం పథకం అమలు చేయనున్నారు అని తెలియచేశారు.
అలానే తల్లికి వందనం పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తారు ? ఈ పథకానికి అవసరమగు అర్హతలు ఏమిటి ? అర్హత కలిగి ఉండి అనర్హుల జాబితాలో పేరు ఉంటే ఏం చేయవలసి వుంటుంది అనే అన్ని అంశాల యొక్క సమగ్ర సమాచార కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ ప్రతీ రోజూ మీ మొబైల్ కి ప్రభుత్వ పథకాల సమాచారం రావాలి అంటే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥తల్లికి వందనం పథకం అనగా ఏమిటి ? :
- రాష్ట్రంలో 1 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000/- రూపాయల చొప్పున ఆర్థిక సహకారం అందించే పథకమే తల్లికి వందన పథకం
- ఈ పథకం ద్వారా ఒక తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి లబ్ది చేకూర్చనున్నారు.
🔥 తల్లికి వందనం పథకం అర్హతలు :
- కుటుంబం యొక్క ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో అయితే నెలకు పదివేల రూపాయలు , పట్టణ ప్రాంతాల్లో అయితే నెలకు 12 వేల రూపాయలు లోపుగా ఉండాలి.
- హౌస్ హోల్డ్ డేటా ప్రకారం కుటుంబంలో ఒకరైన సరే రైస్ కార్డు కలిగి ఉండాలి.
- కుటుంబానికి మూడు ఎకరాల లోపు మాగాణి భూమి , 10 ఎకరాల లోపు మెట్ట భూమి కలిగి ఉండాలి లేదా రెండు కలిపి పది ఎకరాల లోపు ఉండాలి.
- నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు. ఆటో, టాక్సీ , ట్రాక్టర్లకు మినహాయింపు కలదు.
- కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు.
- కుటుంబంలో ఆదాయపన్ను చెల్లించేవారు ఉండరాదు.
🔥 తల్లికి వందనం పథకం షెడ్యూల్ విడుదల :
- పథకం లాంచ్ చేయడం :12/06/2025
- గ్రామ వార్డు సచివాలయాలలో అర్హుల మరియు అనర్హుల జాబితా ప్రదర్శన : 12/06/2025
- సచివాలయం నందు ఫిర్యాదులు మరియు గ్రీవెన్స్ స్వీకరణ : 12/06/2025 నుండి 20/06/2025
- గ్రీవెన్స్ లో పరిశీలన మరియు సప్లమెంటరీ ఎలిజిబుల్ లిస్ట్ ప్రిపరేషన్ : 21/06/2025 నుండి 28/06/2025
- ఒకటవ తరగతి మరియు జూనియర్ ఇంటర్ విద్యార్థుల అర్హుల జాబితా సచివాలయాల నందు ప్రదర్శన : 30/06/2025
- అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చేయుట: 05/07/2025
✅ తల్లికి వందనం పథకం డబ్బులు రావాలి అంటే ఇలా చేయండి – Click here
🔥 తల్లికి వందనం పథకం అనర్హులకు గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం :
- తల్లికి వందనం పథకం కి సంబంధించి , అనర్హుల జాబితాలో ఎవరైనా అర్హులు ఉంటే వారు గ్రీవెన్స్ చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు. ఇందులో భాగంగా గ్రామ, వార్డ్ సచివాలయం సిబ్బంది కి అవకాశం కల్పిస్తారు.
- ఈ నెల 20 వ తేదీ లోగా లబ్ధిదారులు గ్రీవెన్స్ నమోదు చేసుకోగలరు.
🔥 తల్లికి వందనం పథకం పేమెంట్ చేయు విధానం :
- లబ్దిదారులకు ఆధార్ కి లింక్ కాబడిన బ్యాంకు అకౌంట్ / పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కు జమచేయనున్నారు.
- ప్రాథమికంగా విద్యార్థి యొక్క తల్లి గారి ఆధార్ కి లింక్ కాబడిన బ్యాంకు అకౌంట్ కి జమ చేస్తారు.
- తల్లి చనిపోయినచో తండ్రి గారి అకౌంట్ కి జమ చేస్తారు.
- తల్లి , తండ్రి లేకపోతే విద్యార్థి యొక్క సంరక్షకుడు కి డబ్బులు జమ చేస్తారు.
- అనాథల కి సంబంధించి ఆ జిల్లా కలెక్టర్ గారికి అధికారాలు ఇవ్వడం జరిగింది.
- ఒక్కొక్క విద్యార్థికి 15,000/- రూపాయలు చొప్పున శాంక్షన్ కాగా అందులో 2,000/- రూపాయలు రాష్ట్రం లో గల ప్రభుత్వ, పాఠశాలల యొక్క అభివృద్ధి కొరకు జిల్లా కలెక్టర్ లకు జమ చేస్తారు. 13,000/- రూపాయలు లబ్ధిదారుల ఖాతా నందు జమ అవుతాయి. ఇప్పటికే ప్రక్రియ పూర్తి కావడం తో శుక్రవారం నుండి డబ్బులు జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది.