తల్లికి వందనం పథకం అధికారిక G.O విడుదల – అర్హుల జాబితా ఇక్కడ చూడండి | Thalliki Vandhanam Scheme Eligibility List

తల్లికి వందనం పథకం డబ్బులు జమ
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూపర్ సిక్స్ పథకాలలో ప్రధాన పథకం అయిన తల్లికి వందనం పథకం (Talliki Vandhanam) అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక G.O విడుదల చేసింది. ఈ G.O లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం 2025 – 26 నుండి తల్లికి వందనం పథకం అమలు చేయనున్నారు అని తెలియచేశారు.

అలానే తల్లికి వందనం పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తారు ? ఈ పథకానికి అవసరమగు అర్హతలు ఏమిటి ? అర్హత కలిగి ఉండి అనర్హుల జాబితాలో పేరు ఉంటే ఏం చేయవలసి వుంటుంది అనే అన్ని అంశాల యొక్క సమగ్ర సమాచార కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

✅ ప్రతీ రోజూ మీ మొబైల్ కి ప్రభుత్వ పథకాల సమాచారం రావాలి అంటే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥తల్లికి వందనం పథకం అనగా ఏమిటి ? :

  • రాష్ట్రంలో 1 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000/- రూపాయల చొప్పున ఆర్థిక సహకారం అందించే పథకమే తల్లికి వందన పథకం
  • ఈ పథకం ద్వారా ఒక తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి లబ్ది చేకూర్చనున్నారు.

🔥 తల్లికి వందనం పథకం అర్హతలు :

  • కుటుంబం యొక్క ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో అయితే నెలకు పదివేల రూపాయలు , పట్టణ ప్రాంతాల్లో అయితే నెలకు 12 వేల రూపాయలు లోపుగా ఉండాలి.
  • హౌస్ హోల్డ్ డేటా ప్రకారం కుటుంబంలో ఒకరైన సరే రైస్ కార్డు కలిగి ఉండాలి.
  • కుటుంబానికి మూడు ఎకరాల లోపు మాగాణి భూమి , 10 ఎకరాల లోపు మెట్ట భూమి కలిగి ఉండాలి లేదా రెండు కలిపి పది ఎకరాల లోపు ఉండాలి.
  • నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు. ఆటో, టాక్సీ , ట్రాక్టర్లకు మినహాయింపు కలదు.
  • కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు.
  • కుటుంబంలో ఆదాయపన్ను చెల్లించేవారు ఉండరాదు.

🔥 తల్లికి వందనం పథకం షెడ్యూల్ విడుదల :

  • పథకం లాంచ్ చేయడం :12/06/2025
  • గ్రామ వార్డు సచివాలయాలలో అర్హుల మరియు అనర్హుల జాబితా ప్రదర్శన : 12/06/2025
  • సచివాలయం నందు ఫిర్యాదులు మరియు గ్రీవెన్స్ స్వీకరణ : 12/06/2025 నుండి 20/06/2025
  • గ్రీవెన్స్ లో పరిశీలన మరియు సప్లమెంటరీ ఎలిజిబుల్ లిస్ట్ ప్రిపరేషన్ : 21/06/2025 నుండి 28/06/2025
  • ఒకటవ తరగతి మరియు జూనియర్ ఇంటర్ విద్యార్థుల అర్హుల జాబితా సచివాలయాల నందు ప్రదర్శన : 30/06/2025
  • అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చేయుట: 05/07/2025

తల్లికి వందనం పథకం డబ్బులు రావాలి అంటే ఇలా చేయండి – Click here

🔥 తల్లికి వందనం పథకం అనర్హులకు గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం :

  • తల్లికి వందనం పథకం కి సంబంధించి , అనర్హుల జాబితాలో ఎవరైనా అర్హులు ఉంటే వారు గ్రీవెన్స్ చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు. ఇందులో భాగంగా గ్రామ, వార్డ్ సచివాలయం సిబ్బంది కి అవకాశం కల్పిస్తారు.
  • ఈ నెల 20 వ తేదీ లోగా లబ్ధిదారులు గ్రీవెన్స్ నమోదు చేసుకోగలరు.

🔥 తల్లికి వందనం పథకం పేమెంట్ చేయు విధానం :

  • లబ్దిదారులకు ఆధార్ కి లింక్ కాబడిన బ్యాంకు అకౌంట్ / పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కు జమచేయనున్నారు.
  • ప్రాథమికంగా విద్యార్థి యొక్క తల్లి గారి ఆధార్ కి లింక్ కాబడిన బ్యాంకు అకౌంట్ కి జమ చేస్తారు.
  • తల్లి చనిపోయినచో తండ్రి గారి అకౌంట్ కి జమ చేస్తారు.
  • తల్లి , తండ్రి లేకపోతే విద్యార్థి యొక్క సంరక్షకుడు కి డబ్బులు జమ చేస్తారు.
  • అనాథల కి సంబంధించి ఆ జిల్లా కలెక్టర్ గారికి అధికారాలు ఇవ్వడం జరిగింది.
  • ఒక్కొక్క విద్యార్థికి 15,000/- రూపాయలు చొప్పున శాంక్షన్ కాగా అందులో 2,000/- రూపాయలు రాష్ట్రం లో గల ప్రభుత్వ, పాఠశాలల యొక్క అభివృద్ధి కొరకు జిల్లా కలెక్టర్ లకు జమ చేస్తారు. 13,000/- రూపాయలు లబ్ధిదారుల ఖాతా నందు జమ అవుతాయి. ఇప్పటికే ప్రక్రియ పూర్తి కావడం తో శుక్రవారం నుండి డబ్బులు జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *