నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీం (NMMSS) అనేది విద్యార్థులకు ఒక మంచి వరం లాంటిది. దేశంలో గల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు NMMSS స్కాలర్షిప్ పొందేదుకు అర్హత కలిగి ఉంటారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి NMMSS స్కాలర్షిప్ కు అప్లై చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.
చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకుగాను ప్రారంభించిన ఈ స్కాలర్షిప్ పథకానికి ఎవరు అర్హులు ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ? స్కాలర్షిప్ డబ్బులు ఎంత మొత్తంలో లభిస్తాయి ? వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 NMMSS అనగా ఏమిటి ? :
- నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీం (NMMSS) అనేది ఎనిమిదవ తరగతి తర్వాత డ్రాప్ అవుట్ రేటును తగ్గించుట అనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది.
- దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు NMMSS కు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఈ స్కాలర్షిప్ కు ఎంపిక కాబడిన వారికి తొమ్మిదవ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలు స్కాలర్షిప్ రూపేనా లభిస్తుంది.
🔥NMMSS దరఖాస్తు చేసుకొనేందుకు ఎవరు అర్హులు ? :
- ఈ స్కాలర్షిప్ కి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎనిమిదవ తరగతి చదువుతూ ఉండాలి.
- ఏడవ తరగతిలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
- విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ అనుబంధ సంస్థలలో విద్య ను అభ్యసిస్తూ ఉండాలి.
- కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు ,రెసిడెన్షియల్ పాఠశాల లలో చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు.
🔥NMMSS పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? :
- NMMSS స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకొనేందుకు ఆన్లైన్ విధానం ద్వారా అవకాశం కల్పించారు.
- ముందుగా అధికారిక పోర్టల్ లో One Time Registration పూర్తి చేసుకోవాలి.
- ఆ తర్వాత Fresh Application విభాగంలో NMMSS – 2025 -26 ను ఎంపిక చేసుకోవాలి.
- అప్లికేషన్లో అవసరమైన వివరాలను నమోదు చేసి సంబంధిత ధృవపత్రాలను కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
- దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 31/08/2025.
🔥NMMSS పథకానికి అవసరమగు ధ్రువపత్రాలు :
- ఆధార్ కార్డు
- ఇటీవల కుల ధ్రువీకరణ పత్రం
- ఇటీవల ఆదాయ ధ్రువీకరణ పత్రం
- ఏడవ తరగతికి సంబంధించిన మార్క్ షీట్లు
🔥NMMSS కు ఎంపిక చేయు విధానం :
- NMMSS స్కాలర్షిప్ కు ఎంపిక చేసేందుకు గాను రాతి పరీక్ష నిర్వహిస్తారు.
- ఈ రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా విద్యార్థులను స్కాలర్షిప్ కు ఎంపిక చేయడం జరుగుతుంది.
- ఈ రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. అవి
- Mental Ability Test
- Scholastic Aptitude Test
- కేంద్ర విద్యా శాఖ నిబంధనల మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఈ పరీక్షను నిర్వహించి స్కాలర్షిప్నకు విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
🔥NMMSS ద్వారా లభించే స్కాలర్షిప్ మొత్తం :
- NMMSS కు ఎంపిక కాబడిన వారికి తొమ్మిదవ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలు చొప్పున మొత్తం 48 వేల రూపాయలు లబ్ధి చేకూరుతుంది.
🔥ముఖ్యమైన తేదీ :
- NMMSS స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 31/08/2025
👉 Click here to Apply for NMMSS scholarship