ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం (AP Free Bus Scheme) ఆగస్టు 15 నుండి అమలు కానున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం తో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో అన్ని బస్ డిపో లలో కూడా ఉచిత బస్ ప్రయాణం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. అలానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం పై సమీక్ష నిర్వహించి జీరో ఫేర్ టికెట్ ను అందించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ Join Our What’sApp Group – Click here
🔥 AP Free Bus Scheme Zero fare ticket :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నుండి అమలు కానున్న మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం పై సమీక్ష నిర్వహించారు.
- ఇందులో భాగంగా ఈ పథకం ను వినియోగించుకునే మహిళలకు జీరో ఫేర్ టికెట్ ను అందించాలని అధికారులకు ఆదేశించారు.
- ఇందులో వీరు ఎక్కడ నుండి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు , సాధారణంగా టికెట్ ధర ఎంత ఉంది , ప్రభుత్వం ఇస్తున్న మొత్తం రాయితీ వివరాలు అన్నీ కూడా జీరో ఫేర్ టికెట్ లో ప్రస్తావించాలని తెలిపారు.
- జీరో ఫేర్ టికెట్ ఇవ్వడం ద్వారా మహిళలు ప్రతీ ప్రయాణం లో ఎంత లబ్ది పొందుతున్నారు అనే అంశం వారికి తెలుస్తుంది.
- August 15 వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్ పథకం సమర్థవంతంగా , కచ్చితత్వం తో అమలు చేయాలని తెలిపారు.
✅ విద్యార్థులకు 20,000/- స్కాలర్షిప్ – అప్లై చేయండి – Click here
🔥Innovative buses ready for AP Free Bus Scheme:
- ఉచిత బస్ ప్రయాణం కొరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ బస్ లను సిద్ధం చేస్తుంది.
- కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకం గా అమలు చేయాలని భావిస్తుండగా , అందుకు అన్ని ఏర్పాట్లు ముమ్మురం చేస్తున్నారు.
- మహిళా ప్రయాణికులు కు, వారి సౌకర్యార్థం బస్ లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
- మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో ఉన్న బస్ కార్మికులను కూడా తీసుకువచ్చి బస్ వర్క్ షాప్ లలో బస్ తయారీ చేస్తున్నారు.
- మహిళల సౌకర్యార్థం బస్ మధ్య లో తలుపు ఏర్పాటు చేస్తారు.
- బస్ లో ఎక్కువ శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తారు. ఇందుకు గాను వారికి కేటాయించిన సీట్లు గుర్తించేలా పసుపు రంగు వేస్తున్నారు. ఆ సీట్లలో కేవలం మహిళలు మాత్రమే కూర్చునేలా ఆదేశాలు జారీ చేస్తారు.
- ఈ పథకం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో అమలు అవుతున్న అన్ని అంశాలు పరిగణ లోకి తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆగస్టు 15 న అమలు చేస్తారు.