74% Buses allocated for AP free bus travel scheme | AP Free Bus Scheme Latest News

AP Free Bus travel Scheme Details
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకం ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (AP Free Bus Scheme). ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటూ ఈ పథకం అమలుకు కృషి చేస్తుంది.

ఇందులో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఈ పథకం యొక్క విధివిధానాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ ను చివరివరకు చదవండి.

AP Nirudyoga Bruthi Scheme Date – Click here

🔥 74% Buses allocated for AP free bus travel scheme :

  • రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15వ తేదీన అమలు చేయనున్న విషయం తెలిసిందే.
  • ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
  • ఈ పథకం అమలు కొరకు రాష్ట్రవ్యాప్తంగా 1350 కొత్త బస్సులను కేటాయించారు.
  • 750 బస్సులు ఇప్పటికీ మంజూరు కాగా మరో 600 బస్సులను కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 11 వేల బస్సులలో 74 శాతం బస్సులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కొరకు కేటాయించడం జరుగుతుంది.

🔥 మహిళలకు బస్ ప్రయాణం ఒకే జిల్లాకు పరిమితం కాదా ? (Isn’t AP Free bus travel for women limited to a single district?) :

  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని జిల్లాకు పరిమితం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పినప్పటికీ ఈ అంశాన్ని తిరిగి మళ్ళీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
  • ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని నూతన జిల్లాల ప్రాతిపదికన అమలు చేయాలని భావించినప్పటికీ ఉమ్మడి జిల్లాలకు విస్తరించాలని ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. అలానే రాష్ట్రం మొత్తం విస్తరించాలా అన్న అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

Join Our What’sApp Group – Click here

🔥 బస్ స్టాప్ లలో & బస్ లలో సౌకర్యాలు మెరుగుదల (Improvement of facilities at bus stops & on buses) :

  • ఆగస్టు 15 వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు మహిళలకు సౌకర్యాలు మెరుగు పరచాలని భావిస్తుంది.
  • ఇందులో భాగంగా బస్ స్టాప్ లలో మరియు బస్సులలో సౌకర్యాలను మరింత విస్తృతం చేయనున్నారు.
  • రాబోయే రెండు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్టాండ్ లోను త్రాగునీటి సౌకర్యం , కూర్చునేందుకు వీడిగా కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయనున్నారు.
  • అవసరాన్ని బట్టి ప్రయాణికుల సంఖ్యను బట్టి పల్లె వెలుగు బస్సులు పెంపుదల కూడా చేయనున్నారు.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *