ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతీ సంవత్సరం 12,000/- స్కాలర్షిప్ ఇస్తున్న ప్రభుత్వం | NMMSS Scholarship 2025-26 Apply Online

NMMSS Scholarship 2025

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీం (NMMSS) అనేది విద్యార్థులకు ఒక మంచి వరం లాంటిది. దేశంలో గల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు NMMSS స్కాలర్షిప్ పొందేదుకు అర్హత కలిగి ఉంటారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి NMMSS స్కాలర్షిప్ కు అప్లై చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.

చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకుగాను ప్రారంభించిన ఈ స్కాలర్షిప్ పథకానికి ఎవరు అర్హులు ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ? స్కాలర్షిప్ డబ్బులు ఎంత మొత్తంలో లభిస్తాయి ? వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 NMMSS అనగా ఏమిటి ? :

  • నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీం (NMMSS) అనేది ఎనిమిదవ తరగతి తర్వాత డ్రాప్ అవుట్ రేటును తగ్గించుట అనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది.
  • దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు NMMSS కు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఈ స్కాలర్షిప్ కు ఎంపిక కాబడిన వారికి తొమ్మిదవ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలు స్కాలర్షిప్ రూపేనా లభిస్తుంది.

🔥NMMSS దరఖాస్తు చేసుకొనేందుకు ఎవరు అర్హులు ? :

  • ఈ స్కాలర్షిప్ కి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎనిమిదవ తరగతి చదువుతూ ఉండాలి.
  • ఏడవ తరగతిలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
  • విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ అనుబంధ సంస్థలలో విద్య ను అభ్యసిస్తూ ఉండాలి.
  • కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు ,రెసిడెన్షియల్ పాఠశాల లలో చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు.

🔥NMMSS పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? :

  • NMMSS స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకొనేందుకు ఆన్లైన్ విధానం ద్వారా అవకాశం కల్పించారు.
  • ముందుగా అధికారిక పోర్టల్ లో One Time Registration పూర్తి చేసుకోవాలి.
  • ఆ తర్వాత Fresh Application విభాగంలో NMMSS – 2025 -26 ను ఎంపిక చేసుకోవాలి.
  • అప్లికేషన్లో అవసరమైన వివరాలను నమోదు చేసి సంబంధిత ధృవపత్రాలను కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
  • దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 31/08/2025.

🔥NMMSS పథకానికి అవసరమగు ధ్రువపత్రాలు :

  • ఆధార్ కార్డు
  • ఇటీవల కుల ధ్రువీకరణ పత్రం
  • ఇటీవల ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • ఏడవ తరగతికి సంబంధించిన మార్క్ షీట్లు

🔥NMMSS కు ఎంపిక చేయు విధానం :

  • NMMSS స్కాలర్షిప్ కు ఎంపిక చేసేందుకు గాను రాతి పరీక్ష నిర్వహిస్తారు.
  • ఈ రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా విద్యార్థులను స్కాలర్షిప్ కు ఎంపిక చేయడం జరుగుతుంది.
  • ఈ రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. అవి
  • Mental Ability Test
  • Scholastic Aptitude Test
  • కేంద్ర విద్యా శాఖ నిబంధనల మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఈ పరీక్షను నిర్వహించి స్కాలర్షిప్నకు విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

🔥NMMSS ద్వారా లభించే స్కాలర్షిప్ మొత్తం :

  • NMMSS కు ఎంపిక కాబడిన వారికి తొమ్మిదవ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలు చొప్పున మొత్తం 48 వేల రూపాయలు లబ్ధి చేకూరుతుంది.

🔥ముఖ్యమైన తేదీ :

  • NMMSS స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 31/08/2025

👉 Click here to Apply for NMMSS scholarship

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!