కూటమి ప్రభుత్వం నుండి మరో తీపి కబురు | ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం NTR భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన దివ్యాంగులు కి 6000 రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం , దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

కూటమి ప్రభుత్వం అవసరమైన దివ్యాంగులు వారికి 100 శాతం సబ్సిడీతో ట్రై సైకిల్ లను అందించనుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఈ మూడు చక్రాల వాహనాలను ఏ విధంగా పొందాలి ? ఎవరు ఈ వాహనాలను పొందేందుకు గాను అర్హులు వంటి మరిన్ని వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిల్ ల పంపిణీ :

  • రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గల దివ్యాంగులు కి మంచి శుభవార్త తెలియచేసింది. 100 శాతం రాయితీ తో ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా మోటార్ ట్రై సైకిల్ లను (రెట్రోఫిటెడ్ మోటార్ వాహనాలు) అందించాలి అని నిర్ణయించింది.
  • ఇటీవల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు దివ్యాంగుల సంక్షేమ శాఖా అధికారులు మూడు చక్ర వాహనాలను అందించేందుకు శాఖా పరమైన విధివిధానాలు తయారు చేస్తున్నారు.
  • మూడు చక్రాల వాహనాలను తయారు చేసే సంస్థ తో కాంట్రాక్ట్, టెండరు ప్రక్రియ కొనసాగుతుంది.

🔥 ట్రై సైకిల్ లు పొందేందుకు ఎవరు అర్హులు :

  • ట్రైసైకిల్ పొందేందుకు గాను ఎవరు అర్హులు అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే అర్హత ప్రమాణాలు నిర్ణయించింది.
  • డిగ్రీ లేదా అంతకుమించిన విద్యార్హత కలిగి ఉండి , కనీసం ఒక సంవత్సరం కి పైగా స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.
  • ఈ ట్రై సైకిల్ పొందేందుకు గాను కనీసం 70 శాతం కి పైగా వైకల్యం కలిగి వుండాలి.
  • వయస్సు విషయానికి వస్తె 18 సంవత్సరాలు నిండి యుండి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
  • 3 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగి వుండాలి.

🔥 రాష్ట్ర వ్యాప్తంగా 1750 వాహనాలు పంపిణీ :

  • 2025 – 26 వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నియోజకవర్గానికి 10 వెహికల్స్ చొప్పున మొత్తం 1750 వాహనాలను పంపిణీ చేయనున్నారు.
  • ఒక్కొక్క వాహనానికి 1 లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని అంచనా వేస్తున్నారు.
  • ఇందుకు గాను మొత్తం 17.50 కోట్లు బడ్జెట్ కేటాయించారు.

🔥అధికంగా దరఖాస్తులు వచ్చే అవకాశం :

  • మొత్తం 1750 వాహనాలను ప్రభుత్వం అర్హులకు ఇవ్వాలని నిర్ణయించగా, 4000 కి పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
  • మొత్తం 1750 ట్రై సైకిల్స్ తో పాటు స్వచ్ఛంద సంస్థల ద్వారా మరో 60 వాహనాలను అందించేందుకు గాను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!