తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు శుభవార్త ! గ్రీవెన్స్ నమోదు చివరి తేదీ పొడిగింపు | Thalliki Vandanam Scheme Grievance Last Date Extended

తల్లికి వందనం పథకం
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు శుభవార్త తెలియచేసింది. ఈ పథకాన్ని జూన్ 12 వ తేదీన ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం , గ్రీవెన్స్ నమోదు కొరకు జూన్ 20వ తేదీ ను చివరి తేదీ గా గతంలో షెడ్యూల్ విడుదల చేసింది.

అయితే లబ్ధిదారుల యొక్క సౌకర్యార్థం గ్రీవెన్స్ నమోదు తేదీ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలానే లబ్ధిదారులకు సంబంధించి పేమెంట్ స్టేటస్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 తల్లికి వందనం పథకం గ్రీవెన్స్ నమోదు తేదీ పొడిగింపు:

  • రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం అయిన తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ను విడుదల చేసింది. అర్హత కలిగి ఉండి , అనర్హుల జాబితాలో ఉన్న వారికి గ్రీవెన్స్ నమోదు చేసుకోమని చెప్పింది. జూన్ 20 లోపుగా గ్రీవెన్స్ నమోదు కొరకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారుల సౌకర్యార్థం ఈ తేదీని పొడిగించింది.
  • ఇంకా ఎవరైనా గ్రీవెన్స్ నమోదు చేసుకొని వారు ఇంకా ఎవరైనా ఉంటే వీలనంత త్వరగా మీ గ్రామ , వార్డు సచివాలయం లను సంప్రదించి , గ్రీవెన్స్ రైస్ చేసుకోగలరు.
  • చివరి తేదీ విషయంలో ఎవరూ కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ విషయమే ప్రభుత్వం చివరి తేదీ అధికారిక ప్రకటన ను అధికారులకు తర్వాత తెలియచేస్తుంది.

🔥 తల్లికి వందనం పథకం డబ్బులు ఏ బ్యాంకు లో పడ్డాయో ఇలా తెలుసుకోండి:

  • తల్లికి వందన పథకం కి సంబంధించి ఇప్పటివరకు అర్హుల లేదా అనర్హుల అన్నది మాత్రమే తెలిసేది. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ఏ బ్యాంకు అకౌంట్ లో డబ్బులు జమ అయ్యాయి అనే అంశం కూడా తెలిసేలా అవకాశం కల్పించారు.
  • ఇందుకు సంబంధించిన లింక్ ను అప్డేట్ చేశారు. పేమెంట్ స్టేటస్ తెలుసుకొనేందుకు గాను మీరు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా తెలుసుకోవచ్చు లేదా మీ గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ను కూడా సంప్రదించవచ్చు.

👉 Click here to Know Tallaki Vandhanam payment status

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *