100/- రూపాయలు కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ – ముఖ్య వివరాలు ఇవే | AP CM Latest Decision

వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ పథకం
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల రెవెన్యూ శాఖ పై సమీక్ష నిర్వహించిన సందర్భంగా కేవలం 100/- రూపాయలు కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రకటించారు.

ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న ప్రజలకు వారి భూమి పై చట్టబద్ధమైన హక్కు కల్పించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా, పారదర్శకంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను అమలు చేయాలని భావిస్తుంది.

🏹 ఏపీ లో పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here

ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా చేస్తారు ? ఎక్కడ చేస్తారు ? అవసరమగు పత్రాలు ఏమిటి? రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధముగా ఉంటుంది ? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

✅ Join Our What’sApp Group – Click here

🔥 వారస్వత భూముల రిజిస్ట్రేషన్ పథకం :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను రాష్ట్ర ప్రభుత్వం సరళతరం చేసింది. గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లు , తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా గ్రామ, వార్డు సచివాలయం లలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధంగా అవకాశం కల్పించనుంది.
  • ఈ పథకం ద్వారా వారసత్వ భూములను చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు.
  • రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకం గా అమలు చేయనుంది.
  • వారసత్వ రిజిస్ట్రేషన్ చేయడం వలన భూ వివాదాలను తగ్గించవచ్చు మరియు ప్రభుత్వ రికార్డులలో తప్పులను సరిచేయవచ్చు.

🔥వారస్వత భూముల రిజిస్ట్రేషన్ పథకం అమలు చేయు విధానం & స్టాంప్ డ్యూటీ వివరాలు :

  • వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను గ్రామ, వార్డు సచివాలయం లను వేదిక గా చేసుకొని అమలు చేయనున్నారు.
  • ఇందుకు గాను గ్రామ, వార్డ్ సచివాలయం సిబ్బందికి ట్రైనింగ్ నిర్వహించి , రాబోయే రెండు మూడు నెలలలో ఈ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది.
  • సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి రిజిస్ట్రేషన్ కొరకు వెళ్లవలసిన అవసరం ఉండదు.
  • భూమి మొత్తం విలువ 10 లక్షల లోపు ఉంటే కేవలం 100/- రూపాయలు స్టాంప్ డ్యూటీ చెల్లించవలసి ఉంటుంది.
  • అలానే భూమి విలువ 10 లక్షల కంటే అధికంగా ఉంటే 1000/- రూపాయలు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి.
  • భూమి యొక్క మార్కెట్ విలువను సబ్ రిజిస్టర్ కార్యాలయం వారు నిర్ధారిస్తారు.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో భాగంగా వారసులు వారి యొక్క భూ వివరాలు మరియు సంబంధిత ధృవపత్రాలను తీసుకొని వెళ్ళ వలసి ఉంటుంది.
  • సచివాలయం సిబ్బంది వారసుల ధ్రువపత్రాలు పరిశీలించి , వారి యొక్క EKYC నమోదు చేస్తారు.
  • ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మళ్ళీ మ్యుటేషన్ కొరకు దరఖాస్తు చేయవలసిన అవసరం ఉండదు . ఆటోమేటిక్ మ్యుటేషన్ విధానం ద్వారా మ్యుటేషన్ జరుగుతుంది.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు మ్యుటేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ పాస్ బుక్ ను పొందవచ్చు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *