ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపు ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసింది ఇందులో భాగంగా రేషన్ డీలర్లకు పలు మార్గదర్శకాలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం , వృద్ధులు మరియు దివ్యాంగులకు ఇంటి వద్దకి రేషన్ పంపిణీ చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. వీరికి ఆ నెల 1వ తేదీ నుండి 5వ తేదీ లోపుగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఈ విషయమే రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు మరియు దివ్యాంగులు సౌకర్యార్థం వీరికి ఒకటవ తేదీ కంటే ముందే రేషన్ పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
అలానే రేషన్ E-KYC కి సంబంధించిన ముఖ్య సమాచారాన్ని కూడా ఈ ఆర్టికల్ లో తెలియజేయడం జరిగింది.
ప్రతీ రోజూ ప్రభుత్వ పథకాల సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మా What’s App Group లో జాయిన్ అవ్వండి.
🔥 జూలై నెల రేషన్ పంపిణీకి సర్వం సిద్ధం :
- జూలై నెలకు సంబంధించి రేషన్ పంపిణీ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత నెల రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్నచిన్న అవాంతరాలను కూడా ఎదుర్కొనే విధంగా మరింత పటిష్టంగా రాసిన పనిచేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.
- ఈసారి మరింతగా డీలర్లను, అధికారులను సమాయత్తం చేయడం ద్వారా రేషన్ పంపిణీ విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
✅ తల్లికి వందనం పథకం చివరి తేదీ పొడిగింపు – Click here
🔥వృద్ధులకు , దివ్యాంగులు వారికి 5 రోజులు ముందే రేషన్ పంపిణీ :
- రాష్ట్రంలో గల వృద్ధులు మరియు దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. వీరికి మిగతా రేషన్ లబ్ధిదారులతో పోలిస్తే ఒక ఐదు రోజుల ముందే రేషన్ పంపిణీ చేసేందుకు గాను నిర్ణయం తీసుకుంది.
- గతంలో ఒకటవ తేదీ నుండి 5వ తేదీ లోపుగా అందరితో సహా వీరికి రేషన్ పంపిణీ చేయమని ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ విషయంలో డీలర్లకు , దివ్యాంగులకు మరియు వృద్ధులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రహించి జూలై నెల నుండి ఒక ఐదు రోజుల ముందుగానే ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది.
- వృద్ధులకు మరియు దివ్యంగులకు ఈనెల 26 నుండి 30 వా తేదీలోగా ఇంటింటికి రేషన్ పంపిణీ చేసేందుకు గాను అవకాశం ఉంది.
🔥 రేషన్ పంపిణీ కోసం EKYC ను 30/06/2025 లోగా పూర్తి చేసుకోండి :
- కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డులో ఉన్న లబ్ధిదారులు అందరూ కూడా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గతంలో రెండుసార్లు రేషన్ E-KYC కు సంబంధించిన గడువు తేదీని పొడిగించినప్పటికీ ఇంకా కొంతమంది లబ్ధిదారులు ఈ-కేవైసీ నమోదు చేసుకోలేదు .
- వీరందరూ కూడా ఈనెల 30వ తేదీలోగా తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. లేదు అంటే వారి రేషన్ కార్డు లేదా ఆ సభ్యుని రేషన్ ఆగిపోయే ప్రమాదం ఉంది.
- ఈ కేవైసీ పూర్తి చేసుకోని వారు మీ సంబంధిత రేషన్ డీలర్ వద్ద లేదా గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది వద్ద E-KYC నమోదు చేసుకోవచ్చు.
- ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఈ-కేవైసీ నమోదు చేసుకోవలసిన అవసరం లేదు, ఐదు సంవత్సరాలు దాటిన వారందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలి.
- మీ రేషన్ కార్డు EKYC నమోదు అయింది లేనిది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.