ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు కొరకు మరియు ఇతర రేషన్ కార్డు సర్వీసులు కొరకు దరఖాస్తులు నిరంతరంగా స్వీకరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలో భాగంగా అర్హులందరికీ కూడా గతంలో ఉన్న లబ్ధిదారులకు కలుపుకొని అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలియజేయడం జరిగింది.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు గాను విధి విధానాలను రూపొందించడం జరుగుతుంది.
ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
ప్రతీ రోజూ వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం మీ మొబైల్ కు రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రాం గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి..
🔥నూతన రేషన్ కార్డులు జారీకి రంగం సిద్ధం :
- రాష్ట్రంలో గ్రామ, వార్డ్ సచివాలయం ల ద్వారా రేషన్ కార్డుల యొక్క వివిధ సర్వీసులు అందిస్తున్నారు. ఇందుకు గాను రేషన్ కార్డ్ సర్వీసులు నిరంతరంగా వుంటాయి అని గతంలోనే తెలియచేశారు.
- రేషన్ కార్డ్ సర్వీసులు పూర్తి అయిన తర్వాత వారికి రేషన్ కార్డులు అందజేయవలసి ఉంది.
- ఇప్పటికే రేషన్ కార్డ్ సర్వీసులు పొంది వున్న వారు కొత్త రేషన్ కార్డ్ కొరకు ఎదురుచూస్తున్నారు. దీని కొరకు రాష్ట్ర ప్రభుత్వం మరి కొద్ది రోజులలో వీరు అందరికీ కూడా రేషన్ కార్డ్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
✅ RTC లో 800 కండక్టర్ ఉద్యోగాలు – Click here
🔥సచివాలయం సిబ్బంది ద్వారా రేషన్ కార్డులు జారీ :
- రాష్ట్రం లో గల సచివాలయం సిబ్బంది సహకారం తో ప్రజలందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- ఇందు కొరకు సచివాలయం సిబ్బంది అందరి చేత రేషన్ కార్డ్ సర్వే చేయించనుంది.
- E – KYC నమోదు ద్వారా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు.
- ఈ సర్వే ద్వారా రాష్ట్రం లో ఉన్న బోగస్ రేషన్ కార్డులను తొలగించాలి అని ప్రభుత్వం భావిస్తుంది.
- అర్హత కలిగిన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసి , అనర్హులను తొలగించనున్నారు.
- ఇందుకు సంబంధించి మరికొద్ది రోజులలో రేషన్ కార్డ్ సర్వే ప్రారంభం కానుంది.