మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పై ముఖ్యమంత్రి కీలక ప్రకటన | AP CM announcement on free bus travel

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పునరుద్ఘాటించారు.

సూపర్ సిక్స్ పథకాలలో ప్రధాన పథకం అయిన ఈ పథకం అమలు విషయమే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలవుతున్న అన్ని రాష్ట్రాల లో సర్వే నిర్వహించి , మరికొద్ది రోజులలో ఈ పథకం అమలు చేయనున్నారు అన్న విషయం తెలిసిందే.

🔥 ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు :

  • రాష్ట్రంలో ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానుకగా ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ప్రజలందరికీ తెలియజేశారు.
  • ఈ పథకం అమలు రాష్ట్ర ప్రభుత్వం పై ఆర్థిక భారం అయినప్పటికీ కూడా ఎన్నికల హామీలు అమలు చేయడం లో భాగంగా కచ్చితంగా అమలు చేస్తున్నామని తెలియచేశారు.
  • ఆగస్టు 15 నుండి ఈ పథకం అమలు లోకి వచ్చే విధంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని తెలియచేశారు.

🏹 5,000/- రూపాయలతో పోస్టు ఆఫీస్ ఫ్రాంచైజ్ పొందండి – Click here

🔥 జిల్లా పరిధిలోనే ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు :

  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించే అంశం పై వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి గారు ఈ పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు.
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నది జిల్లా కే పరిమితం అని సృష్టం చేశారు.
  • ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు గాను కొత్తగా బస్ లు కొనుగోలు చేస్తామని , ఇందు కొరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!