నేతన్న భరోసా పథకం ద్వారా వీరికి సంవత్సరానికి 25,000/- రూపాయలు ఇవ్వనున్న ప్రభుత్వం

నేతన్న భరోసా పథకం
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

నేతన్న భరోసా పథకం వివరాలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుంది. దీనితో పాటుగా మరెన్నో సంక్షేమ పథకాల అమలు చేస్తూ సంక్షేమ ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తూ ఉంది. ఎప్పటికీ సూపర్ సిక్స్ పథకాల్లో అనేక పథకాలలో అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం , సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగానే పథకాలను కూడా అమలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగా చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల చేనేత కార్మికులు కు సంవత్సరానికి 25 వేల రూపాయలు అందించేందుకు నేతన్న భరోసా అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.

మరిన్ని వివరాల కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.

✅ SBI లో డిగ్రీ అర్హతతో 6580 ఉద్యోగాలు – Click here

🔥మరికొద్ది రోజులలో నేతన్న భరోసా :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గల చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించేందుకు గాను కొత్త పథకాన్ని అమలు చేయనుంది.
  • ఈ పథకానికి నేతన్న భరోసా అనే పేరును నిర్ణయించారు. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు సంవత్సరానికి 25వేల రూపాయలను ఆర్థిక సహాయం అందిస్తారు.
  • ఈ పథకానికి సంబంధించి అధికారిక మార్గదర్శకాలు మరుగు కొద్ది రోజులు విడుదల కానున్నాయి.

✅ AP జైళ్ల శాఖలో 400 వార్డర్ ఉద్యోగాలు – Click here

🔥చేనేతలకు ఉచిత విద్యుత్:

  • రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్లకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఒక మంచి శుభవార్తను తెలియజేసింది.
  • చేనేత మగ్గాలను కలిగి ఉన్న చేనేత కారులకు వారి చేనేతను ప్రోత్సహిస్తూ మగ్గాలు కలిగిన వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తారు. అలానే పవర్ లూమ్స్ కలిగి ఉంటే 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు అందించడం జరుగుతుంది.
  • జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు దీంతో పాటుగా చేనేత కార్లకు లెఫ్ట్ కలిగే విధంగా మరిన్ని నిర్ణయాలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు.

🔥చేనేతలకు మరిన్ని లబ్ది చేకూర్చే అంశాలు :

  • ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేతకారులకు లబ్ధి చేకూరే విధంగా వివిధ కార్యక్రమాలను ప్రారంభించనుంది.
  • ఉచిత విద్యుత్ పథకంతో పాటుగా చేనేతకారులు తయారు చేసిన హ్యాండ్లూమ్ వస్త్రాలపై జిఎస్టి ను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.
  • అలానే నేతన్నలకు సహకరించే విధంగా ఐదు కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ను ఏర్పాటు చేయనున్నారు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!