ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తెలియచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ భృతిని ఈ సంవత్సరం లో నిరుద్యోగులకు అందజేస్తామని తెలియచేశారు.
ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం మీ మొబైల్ కు రావాలి అంటే వెంటనే మా What’s App Group లో జాయిన్ అవ్వండి.
🔥 నిరుద్యోగ భృతి పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన – ఈ సంవత్సరంలోనే అమలు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కి సంబంధించి గుడ్ న్యూస్ తెలియచేసింది. ఎన్నికల హామీలలో ప్రధాన హామీ అయిన ” నిరుద్యోగ భృతి ” అంశం పై కీలక ప్రకటన చేసింది.
- నిరుద్యోగ భృతిని ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తామని మచిలీపట్నం లో జరిగిన కార్యకర్తల సమావేశంలో లోకేష్ గారు ప్రస్తావించారు. ఈ సంవత్సరంలోనే నిరుద్యోగ భృతి పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు.
- ఇప్పటికే గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్ష , మెగా డీఎస్సీ పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం , వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- అలానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా వివిధ ప్రైవేట్ ఉద్యోగాలను కూడా రాష్ట్ర నిరుద్యోగులకు అందించేందుకు అవకాశం కల్పిస్తుంది.
- నిరుద్యోగ భృతి ఇస్తే వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది.
నిరుద్యోగ భృతి ఎంత ఇస్తారు ?
రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగులకు నెలకు 3,000/- రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తారు. అర్హత ఉన్న నిరుద్యోగుల అకౌంట్లో ప్రతీ నెలా 3,000/- రూపాయలు జమ చేస్తారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు పైన ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
నిరుద్యోగ భృతి ఎప్పటినుండి అమలు చేస్తారు ?
మంత్రి నారా లోకేష్ గారు తాజాగా చేసిన ప్రకటన ప్రకారం ఈ సంవత్సరం చివరిలోపు నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేస్తామని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన వెల్లడించారు.
గతంలో కూడా నిరుద్యోగ భృతి పథకం అమలు :
టిడిపి పార్టీ 2014లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2019 సంవత్సరంలో ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం అమలు చేసిన తర్వాత ప్రారంభంలో అర్హులైన నిరుద్యోగుల అకౌంట్ లో నెలకు 1,000/- రూపాయలు చొప్పున జమ చేసింది. తరువాత నెలకు 2,000/- రూపాయలు చొప్పున జమ చేసింది. 2019 లో ప్రభుత్వం మారడంతో ఈ పథకం ఆగిపోయింది. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ సంవత్సరం చివరిలోపు అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది.
నిరుద్యోగ భృతి పథకానికి ఎవరు అర్హులు :
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
- ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.
- ఆదాయపన్ను చెల్లిస్తున్న వారు అనర్హులు
- ప్రభుత్వ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తప్పనిసరిగా ఉండాలి.
నిరుద్యోగ భృతి కోసం అవసరమైన సర్టిఫికెట్స్ :
నిరుద్యోగ భృతి పథకానికి క్రింది విధంగా అర్హతలు ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం
- రేషన్ కార్డు
- ఆధార్ కార్డు
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా బీటెక్ సర్టిఫికెట్
- బ్యాంకు పాస్ బుక్ (NPCI లింకింగ్ తప్పనిసరి)