ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి వరుసగా అమలవుతున్నాయి. జూన్ 12వ తేదీ నుండి తల్లికి వందనం పథకం అమలు అవుతూ ఉండగా మరికొద్ది రోజులలో సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధాన పథకం అయిన APSRTC బస్ లలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సమాచారం మీ మొబైల్ లో వాట్సాప్ కి రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి..
🔥 ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం :
- రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని , సూపర్ సిక్స్ పథకాలు ను రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక తో అమలు చేస్తుంది అని మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలియచేశారు.
- ఆగస్టు 15 నుండి కచ్చితంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అందిస్తామని తెలియచేసారు.మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని తెలియచేశారు.
🏹 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు కోసం అధికారులు కసరత్తు :
- ఈ పథకం ద్వారా అమలు ద్వారా సూపర్ సిక్స్ పథకాల్లో అన్ని పథకాల అమలు పూర్తి అవుతుంది అని గతములో ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం తెలిసిందే.
- మహిళలకు ఉచిత బస్ పథకాన్ని అమలు కొరకు అధికారులు మార్గదర్శకాలు తయారు చేస్తున్నారు అని తెలియచేశారు.