ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆగస్టులో పథకాల పండగ | కొత్త పెన్షన్లు పంపిణీ, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం పథకాలు

ఆగస్టులో నూతన పెన్షన్లు, అన్నదాత సుఖీభవ పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలు అమలు
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు నెలలో పలు సంక్షేమ పథకాలు అమలు కానున్నాయి. ఈ సంక్షేమ పథకాల ద్వారా రైతులకు , మహిళలకు , ఆటో డ్రైవర్లకు , వితంతువులకు మొదలగు వారికి ఆగస్టు నెలలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఈ సంక్షేమ పథకాలు తో పాటు ఆగస్టు 15 నాటికి P4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలు దత్తత తీసుకొని , వారికి కూడా సహాయం చేయనున్నారు.

ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.

పదో తరగతి అర్హతతో 4,987 ఉద్యోగాలు – Click here

🔥 ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 01 న లక్ష మందికి పైగా నూతన పెన్షన్లు పంపిణీ :

  • రాష్ట్రంలో NTR భరోసా పెన్షన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ దారులకు ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా లక్ష మందికి పైగా వితంతువులకు పెన్షన్లు మంజూరు చేసింది.
  • వీరి అందరికి కూడా ఆగస్టు 01 వ తేదీన 4,000/- రూపాయలు చొప్పున పెన్షన్ అందిస్తారు.
  • ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన కూడా విడుదల అవ్వడం తో నూతనంగా పెన్షన్ అందుకొనే పెన్షన్ దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

🔥ఆగస్టు 02 న ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం :

  • సూపర్ సిక్స్ లో ఒక ప్రధాన పథకం అయిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 02 వ తేదీన అమలు చేయనుంది.
  • అన్నదాత సుఖీభవ పథకం కి సంబంధించి , దరఖాస్తు ప్రక్రియ & అర్హుల జాబితా కూడా తయారు అయిపోయింది.
  • అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 5000/- రూపాయలు & పీఎం కిసాన్ ద్వారా 2000 రూపాయలు మొత్తం 7000/- రూపాయలను ఆగస్టు 02 మరియు 03 వ తేదీలలో జమ చేస్తామని వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

🔥 ఆగస్టు 15 న మహిళలకు ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్ ప్రయాణం & P4 కార్యక్రమం:

  • RTC బస్ లలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం , మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్న పథకం.
  • మహిళలకు సంబంధించిన పథకం కావడంతో ఈ పథకం అమలు లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని , ఇతర రాష్ట్రాలలో అమలు కాబడుతున్న ఈ పథకం ను కూడా పరిశీలించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ పథకం అమలు చేయనున్నారు.
  • రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 రకాల బస్ లలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు.
  • ఈ పథకాన్ని జిల్లా పరిధి వరకు పరిమితం చేస్తారా లేదా రాష్ట్రం మొత్తానికి విస్తరిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
  • ఆగస్టు 15 నుండి అమలు కానున్న ఈ పథకం కి సంబంధించి మార్గదర్శకాలు మరి కొద్ది రోజులలో విడుదల కానున్నాయి.

🔥ఆగస్టు నెల లో ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం:

  • రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం అమలు చేస్తే ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బ తింటుంది అన్న వాదన కూడా ఉంది.
  • ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలన చేసింది.
  • ఆటో డ్రైవర్ లకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించడం తో ఆటో డ్రైవర్లు కూడా ఈ పథకం అమలును స్వాగతించే అవకాశం ఉంది.
  • ఆటో డ్రైవర్లకు కూడా ఆగస్టు 15 వ తేదీ నాడే ఆర్థిక సహాయం అందించేందుకు అవకాశం ఉంది.
  • ఆగస్టు నెలలో పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కొరకు P4 కార్యక్రమం ను కూడా ప్రారంభించింది. P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శులు మరియు బంగారు కుటుంబాలు ఎంపిక కూడా జరుగుతుంది.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *