రాష్ట్రంలో మరో కొత్త పథకం | ఆదరణ పథకం పునః ప్రారంభం | ఆదరణ 3.O | Aadharan Scheme Details

ఆదరణ పథకం అర్హతలు, అప్లై విధానము, కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన వివిధ పథకాలు అమలు కొరకు కార్యాచరణ జరుగుతుండగా , ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగానే పథకాలను కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా వెనకబడిన తరగతుల వారి అందరికీ వర్తించే విధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన ఆదరణ పథకాన్ని మళ్లీ పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకాన్ని ఆదరణ 3.O అనే పేరుతో అమలు లోకి తీసుకురానున్నారు.

ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర బీసీ వెల్ఫేర్ శాఖా మాత్యులు శ్రీమతి సవిత గారు సమాచారాన్ని తెలియజేశారు.

Join Our what’s app Channel – Click here

గతంలో అమలైన ఈ ఆదరణ పథకం అనగా ఏమిటి ? ఈ పథకం ద్వారా ఎవరు లబ్ధి పొందుతారు ? ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు ఏమిటి ? వంటి వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥ఆదరణ పథకం అనగా ఏమిటి ? :

  • వెనుకబడిన తరగతుల వారికి చెందిన కులవృత్తుల వారికి & చేతి వృత్తుల వారికి వారి వృత్తి లో సాధికారత సాధించేందుకు గాను మరియు వారి ఆదాయం పెంపొందించేందుకు గాను తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టారు.
  • ఈ పథకం ద్వారా బీసీ కులాల వారికి 90 శాతం సబ్సిడీతో పనిముట్లు అందజేసేవారు.
  • వెనుకబడిన తరగతులకు చెందిన కులాల వారికి సబ్సిడీ ద్వారా పనిముట్లు మరియు ఉపకరణాలు అందించి వారికి ఆర్థిక పురోగతి కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
  • ఈ ఆదరణ పథకాన్ని బీసీలకు వెన్ను దున్ను పథకంగా చెప్పుకోవచ్చు.

🔥ఆదరణ పథకం ద్వారా లబ్ధి పొందే వృత్తుల వారి జాబితా :

ఆదరణ పథకం ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన వివిధ వృత్తుల వారు లబ్ది పొందుతారు.

ఈ పథకం ద్వారా కుమ్మరి , కమ్మరి , నాయి బ్రాహ్మణ, రజక, టైలరింగ్, వడ్రంగి, భవన నిర్మాణ కార్మికులు, చేనేతకారులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు మొదలగు వృత్తుల వారు లబ్ధి పొందుతారు.

🔥ఆదరణ పథకం యొక్క అర్హతలు :

  • ప్రస్తుతానికి ఈ ఆదరణ పథకానికి సంబంధించి అధికారిక అర్హతలు ప్రకటించబడలేదు అయితే ఈ ఆదరణ పథకం గతంలోని అమలులో ఉన్నది కావున సుమారు ఈ క్రింది పేర్కొన్న అర్హతలు కలిగి ఉన్నవారు ఆదరణ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.
  • వెనకబడిన తరగతులకు చెందిన వారు ఈ పథకానికి అర్హులు.
  • వయస్సు 18 – 50 సంవత్సరాలు లోపు కలిగి వుండాలి.
  • రేషన్ కార్డ్ కలిగి ఉండి , రాష్ట్ర ప్రభుత్వం పథకాల కొరకు ప్రవేశ పెట్టిన ఆరంచెల విధానం (SIX Step validation) కి లోబడి వుండాలి.
  • ఆదరణ పథకానికి దరఖాస్తు చేసుకొనేందుకు రేషన్ కార్డు , కుల ధ్రువీకరణ పత్రం , ఆధార్ కార్డు , ఫోన్ నెంబర్ అవసరమగును.
  • గ్రామ , వార్డు సచివాలయం లో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించవచ్చు. లేదా ఆన్లైన్ విధానం లో సొంతంగా దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండవచ్చు.
ఆదరణ పథకం పూర్తి వివరాలు | Aadarana Scheme Details in Telugu

🔥 ఆదరణ పథకం ద్వారా అధునాతన పరికరాలు : బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు

  • రాష్ట్రంలో ఆదరణ పథకం అమలు చేసి , ఈ పథకం క్రింద అర్హత కలిగిన కుల వృత్తుల వారికి అధునాతన పరికరాలు అందచేస్తామని మంత్రి సవిత గారు తెలియచేసారు.
  • వెనుకబడిన తరగతుల వారికి వారి వృత్తిని సులభతరం చేసేందుకు గాను ఎలాంటి పరికరాలు అవసరం అగునో, ఆ పరికరాల గుర్తింపు కొరకు ప్రాంతాల వారిగా సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించడం జరుగుతుంది అని మంత్రి గారు తెలిపారు.
  • కుల వృత్తుల వారిని వ్యాపార వేత్తలుగా తీర్చి దిద్దటమే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అని మంత్రి గారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!