తల్లికి వందనం గ్రీవెన్స్ కు రేపే చివరి తేదీ | త్వరగా గ్రీవెన్స్ నమోదు చేసుకోండి | Thalliki Vandhanam Grievance Required Documents

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికీ అర్హుల మరియు అనర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. చాలా మందికి డబ్బులు కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం గ్రీవెన్స్ నమోదు చేసుకునేందుకు జూన్ 20వ తేదీ చివరి తేదీ.

అయితే ఇంకా చాలామంది లబ్ధిదారులు గ్రీవెన్స్ రైస్ చేసుకునేందుకు పూర్తిగా అవగాహన లేకపోవడంతో లబ్ధిదారులు నష్టపోయే అవకాశం ఉంది. గ్రీవెన్స్ నమోదు విషయమై సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చివర వరకు చదవండి.

రాష్ర్టంలో రేషన్ కార్డుల సర్వే – Click here

🔥తల్లికి వందనం గ్రీవెన్స్ నమోదు కు జూన్ 20 చివరి తేదీ :

  • రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు హామీ ఇచ్చిన విధంగానే జూన్ 12వ తేదీన తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ కూడా, ఒక్కొక్క విద్యార్థికి 13 వేల రూపాయలు చొప్పున లబ్ధి చేకూర్చడం జరిగింది.
  • అయితే ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉండి కూడా అనర్హుల జాబితాలో ఉన్నవారు మరియు అర్హుల మరియు అనర్హుల జాబితాలో పేర్లు లేని వారు రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం జూన్ 20వ తేదీ లోపుగా వారి యొక్క గ్రామ, వార్డు సచివాలయం నందు గ్రీవెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఇప్పటికీ చాలామంది గ్రీవెన్స్ నమోదు చేసుకున్నప్పటికీ ఇంకా చాలామంది గ్రీవెన్స్ నమోదు చేసుకోవలసిన విషయం తెలుస్తోంది.
  • ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా జూన్ 20వ తేదీ లోపుగా సంబంధిత గ్రామ వార్డు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ మరియు డేటా సెక్రటరీ గారి సహకారంతో నమోదు చేసుకోగలరు.

🔥తల్లికి వందనం గ్రీవెన్స్ ఈ విధంగా నమోదు చేసుకోండి:

  • తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో గల అర్హత మరియు అనర్హత జాబితాను చెక్ చేసుకోవాలి.
  • తర్వాత వారు అర్హుల జాబితాలో ఉంటే పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
  • ఒకవేళ అనర్హుల జాబితాలో ఉన్న లేదా ఏ జాబితాల పేరు లేకపోయినా వీరు తప్పనిసరిగా జూన్ 20వ తేదీలోగా గ్రీవెన్స్ నమోదు చేసుకోవాలి.
  • గ్రీవెన్స్ నమోదు నిమిత్తం మీరు గ్రామ సచివాలయంలో అయితే డిజిటల్ అసిస్టెంట్ వారిని వార్డు సచివాలయంలో అయితే వార్డు ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారిని సంప్రదించవలసి ఉంటుంది.
  • వీరు మీ యొక్క వివరాలను అడిగి మీ సమస్యకు అనుగుణంగా గ్రీవెన్స్ నమోదు చేస్తారు.

🔥 తల్లికి వందనం గ్రీవెన్స్ నమోదు కొరకు అవసరమగునవి :

  • గ్రీవెన్స్ నమోదు కొరకు లబ్ధిదారులు తల్లి ఆధార్ కార్డ్ లేదా గార్డియన్ ఆధార్ కార్డ్ తో పాటుగా విద్యార్థుల ఆధార్ కార్డ్ మరియు విద్యార్థి యొక్క చైల్డ్ ఐడి (చైల్డ్ ఐడి ను విద్యార్థి చదువుతున్న స్కూల్ నుండి పొందవచ్చు), రైస్ కార్డ్ మరియు మొబైల్ నెంబరు అవసరం అవుతాయి.
  • గ్రీవెన్స్ నమోదు అయిన తర్వాత గ్రీవెన్స్ నమోదు చేసిన ఐడి మీ మొబైల్ నెంబర్ కు SMS రూపంలో తెలియజేస్తారు మరియు గ్రీవెన్స్ రిసిప్ట్ను కూడా మీరు గ్రామ అవార్డు సచివాలయం సిబ్బంది నుంచి పొందవచ్చు.

గ్రీవెన్స్ నమోదు చేయు విషయంలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా గ్రామ, అవార్డు సచివాలయం సిబ్బందిని సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకొనవచ్చు మరియు తప్పనిసరిగా జూన్ 20వ తేదీలోగా గ్రీవెన్స్ నమోదు చేసుకోండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *