రాష్ట్రంలో తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ముఖ్యమైన అప్డేట్.. ఈ పథకం ఈ నెలలోనే ప్రారంభించనున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేసిన ప్రభుత్వం ఈ నెలలో అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందనం పథకం లను అమలు చేయబోతున్నట్లుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జూన్ 12వ తేదీన తల్లికి వందనం పథకం లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు ఇచ్చి అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ 12వ తేదీన ఈ పథకానికి అర్హత ఉన్న 67 లక్షల మంది తల్లుల అకౌంట్లో 8,745 కోట్లు జమ చేస్తారు.
✅ Join Our What’sApp Group – Click here
తల్లికి వందనం పథకం ఎవరు అర్హులు ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అర్హులు.
తల్లికి వందనం పథకం ద్వారా ఎంత లబ్ది జరుగుతుంది :
ఒక్కో విద్యార్థికి 15 వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతూ ఉంటే అంత మందికి కూడా 15,000/- రూపాయలు చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.
తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం కసరత్తు :
గతంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాలు శాఖ ద్వారా ఇంటింటా సర్వే నిర్వహించింది. ఈ సర్వే డేటాను మరియు పాఠశాల విద్యాశాఖ డేటాను అనుసంధానం చేసి లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఇందులో భాగంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల శాఖ అధికారులు, విద్యాశాఖ మరియు ఆర్థిక శాఖ అధికారులు సమావేశం కూడా నిర్వహించడం జరిగింది.
తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ముఖ్యమైన సూచనలు :
- తల్లికి వందనం పథకం లబ్ధిదారులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మరియు NPCI స్టేటస్ చెక్ చేసుకోవాలి.
- ఈ పథకం ద్వారా లబ్ధ పొందాలి అంటే తప్పనిసరిగా హౌస్ హోల్డ్ డేటా బేస్ లో తల్లులు మరియు విద్యార్థులు నమోదై ఉండాలి.
- తల్లుల EKYC పూర్తి అయ్యి ఉండాలి.
- తల్లి బ్యాంకు ఖాతా వాడుకలో ఉండాలి. మరియు NPCI లింక్ అయ్యి ఉండాలి.
✅ జూన్ 20వ తేదీన రైతుల అకౌంట్లో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ చేయనున్న ప్రభుత్వం – Click here
Note :
NPCI Status తెలుసుకునేందుకు ఈ క్రింది ఇచ్చిన లింకు పై క్లిక్ చేయండి.