పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 350 ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ | Punjab National Bank Specialist Officer Notification 2025 | Latest Bank Jobs

భారతదేశంలోని ప్రముఖ వాణిజ్య బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సంస్థ నుండి వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 రకాల పోస్ట్లు, 350 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అర్హతలు ,వయస్సు ,  దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🏹 10+2 అర్హతతో గుమస్తా ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • 350 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు , ఖాళీల వివరాలు

  • ఆఫీసర్ క్రెడిట్ – 250
  • ఆఫీసర్ ఇండస్ట్రీ – 75
  • మేనేజర్ ఐటీ – 05
  • సీనియర్ మేనేజర్ ఐటీ – 05
  • మేనేజర్ డేటా సైంటిస్ట్ – 03
  • సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ – 02
  • మేనేజర్ సైబర్ సెక్యూరిటీ – 05
  • సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ – 05

🔥 విద్యార్హత:

పోస్ట్ పేరు విద్యార్హతవయస్సు
ఆఫీసర్ ( క్రెడిట్)CA లేదా ICWA లేదా CFA ఉత్తీర్ణత లేదా 60 శాతం మార్కులతో ఎంబీఏ / మేనేజ్మెంట్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఉత్తీర్ణత 21- 30
ఆఫీసర్ (ఇండస్ట్రీ) సివిల్ / ఎలక్ట్రికల్ / మెకానికల్ / టెక్టైల్/ మైనింగ్ / కెమికల్ / ప్రొడక్షన్ / మెటలర్జీ/ ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 60 శాతం మార్కులతో బి.ఈ లేదా బి. టెక్ ఉత్తీర్ణత21-30
మేనేజర్ ( ఐటీ) కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 60 శాతం మార్కులతో  బి. ఈ లేదా బి.టెక్ ఉత్తీర్ణత లేదా MCA ఉత్తీర్ణత సాధించాలి.25-35
సీనియర్ మేనేజర్ ( ఐటీ)కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 60 శాతం మార్కులతో  బి.ఈ లేదా బి.టెక్ , లేదా MCA ఉత్తీర్ణత సాధించాలి27-38
మేనేజర్ ( డేటా సైంటిస్టు)కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /డేటా సైన్స్ లో 60 శాతం మార్కులతో  బి.ఈ లేదా బి.టెక్ ఉత్తీర్ణత సాధించాలి.25-35
సీనియర్ మేనేజర్ ( డేటా సైంటిస్ట్)కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /డేటా సైన్స్ లో 60 శాతం మార్కులతో  బి. ఈ లేదా బి.టెక్ ఉత్తీర్ణత సాధించాలి.27-38
మేనేజర్ ( సైబర్ సెక్యూరిటీ)కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 60 శాతం మార్కులతో  బి.ఈ లేదా బి.టెక్ ఉత్తీర్ణత లేదా MCA ఉత్తీర్ణత సాధించాలి25-35
సీనియర్ మేనేజర్ ( సైబర్ సెక్యూరిటీ)కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 60 శాతం మార్కులతో  బి.ఈ లేదా బి.టెక్ ఉత్తీర్ణత లేదా MCA ఉత్తీర్ణత సాధించాలి27-38

🔥 వయస్సు

  • పోస్టులను అనుసరించి 21 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.( వయస్సు పరిమితి ఒక్కో పోస్ట్ కి ఒక్కో విధంగా ప్రస్తావించారు , కావున అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ ను పరిశీలించగలరు).
  • ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ – సర్వీస్ మాన్ వారికి అభ్యర్థులకు 5 సంవత్సరాలు
  • ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
  • దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో తేది: 03/03/2025 నుండి 24/03/2025 లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులు అభ్యర్థులు GST తో కలిపి 59 /- రూపాయల అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
  • జనరల్ / EWS / ఓబీసీ అభ్యర్థులు GST తో కలిపి 1180/- రూపాయల అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.

🔥 ఎంపిక విధానం :

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ వ్రాత పరిక్ష ,  పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం:

  • 200 మార్కులకు గాను పరిక్ష నిర్వహిస్తారు.150  ప్రశ్నలకు 120 నిముషాల సమయం కేటాయించారు.
  • ఇందులో రీజనింగ్( 25 ప్రశ్నలకు గాను 25 మార్కులు )  , ఇంగ్లీష్ లాంగ్వేజ్ ( 25 ప్రశ్నలకు గాను 25 మార్కులు ), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్( 50 ప్రశ్నలకు గాను 50 మార్కులు ),ప్రొఫెషనల్ నాలెడ్జ్ ( 50 ప్రశ్నలకు గాను 100 మార్కులు) కేటాయించారు.
  • ప్రతి తప్పు సమాధానానికి గాను ¼ వ వంతు నెగెటివ్ మార్కుల విధానం కలదు.

🔥 ఇంటర్వ్యూ విధానం:

  • ఆన్లైన్ పరీక్ష లు షార్ట్ లిస్ట్ కాబడిన వారికి 50 మార్కులకు గాను పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🔥 పరీక్ష కేంద్రాలు : 

  • దేశంలోని పలు ప్రముఖ నగరాలతో పాటు   తెలుగు రాష్ట్రాలలో కూడా పలు నగరాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు.
  • ఆంధ్ర ప్రదేశ్ :  గుంటూరు/ విజయవాడ , విశాఖపట్నం కేంద్రాలను ఎంపిక చేశారు.
  • తెలంగాణ : హైదరాబాద్ కేంద్రాన్ని ఎంపిక చేశారు.

🔥 జీతం:

  • అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా ప్రారంభ దశలో నెలకు 50,000/- రూపాయల నుండి 1,00,000/-  రూపాయలు దాటి కూడా జీతం లభిస్తుంది.

🔥 సర్వీస్ బాండ్

  • ఎంపిక కాబడిన అభ్యర్థులు బ్యాంక్ వారి ఆదేశాల మేరకు సర్వీసు బాండ్ కి కట్టుబడి వుండాలి.

 🔥 ముఖ్యమైన తేదీలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 03/03/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 24/03/2025

👉  Click here for notification

👉 Click here for official website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!