PM YASASVI YOJANA Scholarship Apply : విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది. 2020 – 21 విద్యా సంవత్సరం నుండి ప్రారంభించిన ప్రధాన మంత్రి యశస్వి యోజన పథకం ద్వారా అందించే స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకొనేందుకు 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను అవకాశం కల్పించింది.
ఆగస్టు 31వ తేదీలోగా ఈ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలలో 9వ తరగతి నుండి 11 తరగతి లోపు విద్యార్థులు అందరూ కూడా ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం , సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేయబడుతున్న పీఎం యశస్వి యోజన పథకం (PM YASASVI YOJANA – Prime minister young achievers scholarship award scheme for vibrant India) ద్వారా ఏ విధముగా స్కాలర్ షిప్ పొందాలి ? దరఖాస్తు చేయు విధానం ఏమిటి ? స్కాలర్ షిప్ కొరకు విద్యార్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు ? వంటి వివిధ అంశాలను ఈ ఆర్టికల్ లో తెలియజేయడం జరిగింది.
Table of Contents
🔥 ప్రధాన మంత్రి యశస్వి యోజన (PM YASASVI YOJANA) స్కాలర్షిప్ కు ఎవరు అర్హులు ? :
- భారతదేశంలో సామాజికంగా వెనుకబడిన OBC , EWS మరియు DNT విద్యార్థుల కొరకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
- ఇది ఒక స్కాలర్షిప్ పథకం. ఈ పథకం ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం.
- 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు.
🔥 PM YASASVI YOJANA – ఆర్థిక ప్రయోజనాలు :
- ఈ పథకం ద్వారా తొమ్మిదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ లను అందజేస్తున్నారు.
- తొమ్మిదవ తరగతి మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి 75 వేల రూపాయలు & ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం మరియు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి 1,25,000 స్కాలర్షిప్ రూపేణా అందిస్తున్నారు.
🔥 కుటుంబ వార్షిక ఆదాయం :
- ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల యొక్క వార్షిక కుటుంబ ఆదాయం 2,50,000/- కంటే తక్కువగా ఉండాలి.
✅ డిగ్రీ అర్హతతో 750 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here
🔥 PM YASASVI YOJANA స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేయు విధానం :
- పి ఎం యశస్వి స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఈ విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకొనేందుకు గాను ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించారు.
🔥 PM YASASVI YOJANA దరఖాస్తు కొరకు అవసరమగు ధ్రువపత్రాలు :
దరఖాస్తు చేసుకోవాలి అనుకునే విద్యార్థులు ఈ కింది ధ్రువపత్రాలు కలిగి వుండాలి. అవి :
- 1. విద్యార్హత పాస్ సర్టిఫికెట్
- 2. విద్యార్థి ఆధార్
- 3. ఆదాయ దృవపత్రం
- 4. కుల ధ్రువీకరణ పత్రం
- 5. బ్యాంకు అకౌంట్ ( ఆధార్ కి లింక్ చేయబడి వుండాలి )
- 6. పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- 7. విద్యార్థి సంతకం
- 8.ఫోన్ నెంబర్
🔥 స్కాలర్ షిప్ పొందే విద్యార్థుల సంఖ్య :
- పీఎం యశస్వి స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకున్న అందరూ అభ్యర్థులకు ఈ స్కాలర్షిప్ లభించదు.
- కేంద్ర ప్రభుత్వం పీఎం యశస్వి పథకం లబ్ధిదారులను రాష్ట్రాల ఆధారంగా ఎంపిక చేస్తుంది.
- ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1401 మంది విద్యార్థులను మరియు తెలంగాణ రాష్ట్రంలో 1001 విద్యార్థులను స్కాలర్షిప్ కొరకు ఎంపిక చేస్తారు.
✅ ఇక ఉచిత బస్సు ప్రయాణం కోసం గుర్తింపు కార్డు అవసరం లేదు – Click here
🔥 పీఎం యశస్వి స్కాలర్షిప్ ఎంపిక విధానం :
- ఈ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి , పరీక్ష లో మెరిట్ వచ్చిన విద్యార్థులను ఎంపిక చేస్తారు.
- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) వారు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
- ఇది OMR ఆధారిత ఆబ్జెక్టివ్ వ్రాత పరీక్ష . ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ఈ పరీక్ష వుంటుంది.
🔥 పరీక్ష విధానం :
- ఈ పరీక్షలో 100 ప్రశ్నలు వుంటాయి. మొత్తం 400 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 3 గంటల సమయం కేటాయిస్తారు.
- ఇది ఓఎంఆర్ ఆధారిత బహుళైచ్చిక ప్రశ్నలను కలిగి ఉంటుంది.
- పరీక్షలో మ్యాథమెటిక్స్ , సైన్స్ , సోషల్ స్టడీస్ , జనరల్ నాలెడ్జ్ నుండి ప్రశ్నలు వస్తాయి.
క్రమ సంఖ్య | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
01 | మాథెమాటిక్స్ | 30 | 120 |
02 | జనరల్ సైన్స్ | 20 | 80 |
03 | సోషల్ స్టడీస్ | 25 | 100 |
04 | జనరల్ నాలెడ్జ్ | 25 | 100 |
- సెప్టెంబర్ 29 న తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 31/08/2025.
- స్కాలర్ షిప్ ఎంపిక కొరకు విద్యార్థుల కి వ్రాత పరీక్ష నిర్వహణ : 29/09/2025