ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలను ప్రకటించింది. మే 3వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన వెబ్ నోట్ లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్ లో నిర్వహిస్తామని , దీనికి సంబంధించిన ప్రశ్న పత్రాలను ట్యాబ్లలో ఇవ్వాలని నిర్ణయించినట్టు తాజాగా విడుదల చేసిన వెబ్ నోట్ లో వెల్లడించింది.
🏹 రైల్వేలో పదో తరగతి అర్హతతో 32,438 ఉద్యోగాలు – Click here
గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి 87 పోస్టులతో ఏపీపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 మార్చ్ 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఈ ఉద్యోగాలకు 1,48,881 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన వారిలో 4,496 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించారు. మెయిన్స్ కి అర్హత సాధించిన వారికి మే 3 నుంచి మీ 9వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు ఏపీపీఎస్సీ నిర్వహించబోతుంది.
🏹 వైజాగ్, హైదరాబాద్ అమెజాన్ ఆఫీసుల రిక్రూట్మెంట్ – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
మెయిన్స్ పరీక్ష వివరాలు కింది విధంగా ఉన్నాయి :
- మే 3వ తేదీన తెలుగు పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష క్వాలిఫై అయితే చాలు ఇందులో వచ్చిన మార్కులు ఫైనల్ సెలక్షన్ కు పరిగణలోకి తీసుకోరు
- మే 4వ తేదీన ఇంగ్లీష్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష క్వాలిఫై అయితే చాలు ఇందులో వచ్చిన మార్కులు ఫైనల్ సెలక్షన్ కు పరిగణలోకి తీసుకోరు.
- పేపర్ -1 పరీక్షను మే 5వ తేదీన నిర్వహిస్తారు.
- పేపర్ -2 పరీక్షను మే 6వ తేదీన నిర్వహిస్తారు.
- పేపర్ -3 పరీక్షను మే 7వ తేదీన నిర్వహిస్తారు.
- పేపర్ -4 పరీక్షను మే 8వ తేదీన నిర్వహిస్తారు.
- పేపర్ -5 పరీక్షను మే 9వ తేదీన నిర్వహిస్తారు.
- మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే అన్ని పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహిస్తారు.
🏹 APPSC Official Website – Click here