APPSC లో మార్పులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ | APPSC Reforms | APPSC Latest News Today | APPSC Notifications

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ లో మార్పులు చేపట్టేందుకు అవసరమైన అంశాలు పైన అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ప్రస్తుతం ఒక కమిటీని కూడా నియమించింది.

ఈ కమిటీకి అధ్యక్షుడిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ గారిని నియమించింది. ఏడుగురు ఉన్నతాధికారులను సభ్యులుగా ఈ కమిటీ నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

🏹 విశాఖపట్నం మత్స్య పరిశోధన కేంద్రంలో ఉద్యోగాలు – Click here

ఈ కమిటీ చేయాల్సిన పని : 

  • ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో సర్వీస్ కమిషన్స్ అనుసరిస్తున్న విధానాలు, పోస్టులు భర్తీ ఎలా చేస్తున్నారు ? పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తున్న విధానం , పరీక్షలు నిర్వహిస్తున్న విధానం మరియు ఇతర ముఖ్యమైన అంశాలు పైన అధ్యయనం చేసి నివేదిక అందజేస్తుంది.

🔥 నివేదిక ఎప్పుడు ఇస్తారు ? : 

  • తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో నివేదికను ఈ నెల 30వ తేదీ లోపు అందజేయాలి అని పేర్కొన్నారు.

ఈ కమిటీ ప్రభుత్వానికి అందజేసిన నివేదికపై చర్చించి ఏపీపీఎస్సీ లో కీలకమైన మార్పులు చేసే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తున్నట్లు సమాచారం.

🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *