ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. పలితాలు విడుదల అవ్వడం తో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు What Next ? అని ఆలోచిస్తున్నారు.
పదవ తరగతి తర్వాత వివిధ కెరీర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో భాగంగా విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ B.Tech చదివేందుకు గాను అవకాశం కల్పించే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ , ఆంధ్రప్రదేశ్ (RGUKT – AP) నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ లోని నూజివీడు , ఇడుపులపాయ, ఒంగోలు మరియు శ్రీకాకుళం నందు వీరికి అడ్మిషన్ లభిస్తుంది.
పేద విద్యార్థులకు , మెరిట్ విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ ఒక వరం లాంటిది.
ఆర్జీయూకేటీ (RGUKT) విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్ర ప్రదేశ్ సంస్థ IIIT – 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 అందుబాటులో గల కోర్సులు:
ఈ సంస్థ 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ B.tech కార్యక్రమం ను కలిగి వుంటుంది.
ఇందులో భాగంగా ఇందులో
ప్రీ యూనివర్సిటీ కోర్సు (2 సంవత్సరాలు) :
మ్యాథమెటిక్స్ , ఫిజిక్స్,కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ సబ్జెక్ట్లను బోధిస్తారు.
B.tech (4 సంవత్సరాలు):
ఇందులో భాగంగా క్రింద పేర్కొన్న వివిధ బ్రాంచ్ లను అందుబాటు లో ఉంచారు.
కెమికల్ ఇంజనీరింగ్ (నూజివీడ్ & R.K వ్యాలీ నందు కలదు)
సివిల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ (నూజివీడ్ & R.K వ్యాలీ నందు కలదు)
🔥 అడ్మిషన్స్ కొరకు అర్హతలు:
10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణత సాధించాలి.
విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు అతి వుండాలి.
ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ ప్రాంతానికి చెందని వారికి సూపర్ న్యూమరరీ సీట్లు (25శాతం) కి అర్హత కలిగి ఉంటారు.
🔥 ట్యూషన్ ఫీజు మరియు మెస్ ఛార్జీలు:
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్కూల్స్ లో చదివిన వారు సంవత్సరానికి 45,000/- రూపాయల ట్యూషన్ ఫీజు (PUC ప్రోగ్రాం కొరకు), 50,000/- రూపాయలు (బి. టెక్ ప్రోగ్రాం) చెల్లించాలి.
ఆంధప్రదేశ్ ప్రభుత్వం వారి ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి అర్హత కలిగిన వారికి ట్యూషన్ ఫీజు నుండి మినహాయింపు లభిస్తుంది.
విద్యార్థులు ప్రతి నెల 3000/- రూపాయల మెస్ చార్జెస్ చెల్లించాలి. ప్రభుత్వం వారి వసతి దీవెన కార్యక్రమం కి అర్హత కలిగిన వారు అదనపు మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది.
విద్యార్థులు 1000/- రూపాయల అడ్మిషన్ ఫీజు చెల్లించాలి ( ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 500/- రూపాయలు చెల్లించాలి). 1200/- రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ ను చెల్లించాలి. 1000/- రూపాయల రిఫండబుల్ కాషన్ డిపాజిట్ చెల్లించాలి.హాస్టల్ మెయింటెనన్స్ ఛార్జ్ 1000/- రూపాయలు చెల్లించాలి.
🔥 దరఖాస్తు చేయు విధానం:
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి లేదా AP ఆన్లైన్ సెంటర్ లను సంప్రదించవచ్చు.
300/- రూపాయల దరఖాస్తు ఫీజు (ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు 200/- రూపాయలు) చెల్లించాలి.
అవసరమగు ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 ఎంపిక విధానం :
పదవ తరగతి లేదా తత్సమాన అర్హత లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా , ప్రభుత్వ స్కూల్ లలో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: 23/04/2025
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు ప్రారంభ తేదీ : 27/04/2025 (ఉదయం 10:00 గంటల నుండి)
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ: 20/05/2025 (సాయంత్రం 5:00 గంటల వరకు)
మరింత సమాచారం కొరకు అధికారిక నోటిఫికేషన్ ను మరియు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, చివరి తేదీలోగా సరైన ధృవపత్రాలు తో దరఖాస్తు చేసుకోగలరు.
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.
👉 Click here for official website