ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కౌసలం సర్వే గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న నిరుద్యోగులకు ప్రస్తుతం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో కౌశలం పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో అభ్యర్థులకు 60 నిమిషాలు పాటు పరీక్షలు నిర్వహించి వారికి ర్యాంకులు కూడా కేటాయిస్తుంది.
కౌశలం పరీక్షలను ముందుగా డిసెంబర్ రెండవ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు రాష్ట్రంలో 1,48527 మందికి నిర్వహిస్తున్నారు. వీరికి పరీక్షలు పూర్తయిన తర్వాత మిగతా వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలి తెలియజేస్తూ ఇప్పటికే సిటిజన్ ఇన్ఫర్మేషన్ గైడ్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో నిరుద్యోగులు కౌశలం వెబ్సైట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, డాష్ బోర్డ్ ఎలా చూడాలి, రెడీనెస్ అసెస్మెంట్ ఎలా చేయాలి, పరీక్షలు ఏ విధంగా రాయాలి, నిరుద్యోగులకు ఎలాంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, నిరుద్యోగులకు నిర్వహించే పరీక్షలో ఏ సబ్జెక్టు నుండి ప్రశ్నలు అడుగుతారు మరియు ఇతర వివరాలు తెలియజేయబడ్డాయి.
అంతే కౌశలం వెబ్సైట్లో ఈ ప్రక్రియ అంతా ఎలా చేయాలి అనేది తెలియజేస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేయబడింది.
✅ Download Citizen Information Guide – Click here
▶️ Download Kaushalam Exam Candidates List – Click here
✅ Download Kaushalam Exam Guidelines – Click here
▶️ Subscribe Kaushalam YouTube Channel – Click here
