AP గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష తేది మార్పు | APPSC Group 2 Mains Exam Resheduled | APPSC Group 2 Mains Latest News Today

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ గ్రూప్స్ – 2 అభ్యర్థులు అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 2  పరీక్ష ను రీషెడ్యుల్ జరిగింది.

 గతంలో ఏపీపీఎస్సీ ఈ పరీక్ష ను 2025 జనవరి 5 వ తారీఖు న నిర్వహించాలని భావించి , ఈ మేరకు తేది 30/10/2024 న కమిషన్ అధికారిక వెబ్ నోట్ ను వెబ్సైట్ లో పోస్ట్ చేసింది.

అయితే అభ్యర్థులు వెబ్ నోట్ రిలీజ్ అయిన తేది నుండి కనీసం 90 రోజుల సమయాన్ని కోరడం , ఈ విషయమే ప్రజాప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించడం తో ఏపీపీఎస్సీ వారు గ్రూప్ – 2 పరీక్ష ను 2025 ఫిబ్రవరి 23 న నిర్వహించడానికి గాను ఈ రోజు ( నవంబర్ 12 / 2024 ) వెబ్ నోట్ విడుదల చేశారు.

ఈ సమాచారాన్ని సంబధించిన పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

ఏదైనా సాధారణ డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకునే అవకాశం వున్న గ్రూప్ – 2 ఉద్యోగాలకు భారీ డిమాండ్ వుంటుంది. ఈ ఉద్యోగాలకు లక్షల మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ వుంటారు.

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ – 2 ఉద్యోగాల భర్తీ కొరకు డిసెంబర్ 2023 లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఏదైనా సాధారణ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు కావడంతో  రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,80000 పైగా దరఖాస్తులు వచ్చాయి.

🏹 విశాఖపట్నం మత్స్య పరిశోధన కేంద్రంలో ఉద్యోగాలు – Click here

🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here 

ఏపీపీఎస్సీ వారు విడుదల చేసిన 899 గ్రూప్ –  2 ఉద్యోగాలలో ఖాళీల వివరాలు ఇలా వున్నాయి.

  • డిప్యూటీ తహసీల్దార్ –  114
  • ఎక్సైజ్  సబ్ ఇన్స్పెక్టర్ – 150
  • మున్సిపల్ కమిషనర్ ( గ్రేడ్ – 3 ) – 4
  • సబ్ రిజిస్టర్ ( గ్రేడ్ – 2 ) -16
  • అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ – 28 వంటి ప్రముఖ పోస్ట్లు కలవు.
  • మొత్తం ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు – 331
  • మొత్తం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు – 568
  • తర్వాత కాలంలో ఈ నోటిఫికేషన్ కి మరో రెండు పోస్ట్లు అదనంగా కలిపారు. దీనితో మొత్తం పోస్టుల సంఖ్య 901 కి చేరింది.

2024 ఫిబ్రవరి 25 న కమిషన్ వారు నిర్వహించిన ప్రిలిమ్స్ పరిక్ష కు 4,04039 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు.అయితే ఈ ప్రిలిమ్స్ పరీక్షా మునుపెన్నడూ లేనంత కఠినంగా వుండడం , నోటిఫికేషన్ లో ప్రస్తావించిన సిలబస్ ను ప్రామాణికం గా తీసుకోలేదు అన్న ఉద్దేశ్యం తో అభ్యర్థులు వుండడంతో , అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు APPSC వారు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కి ఎంపిక చేశారు.

ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలను 2024 ఏప్రిల్ 5 న ప్రకటించారు.ఇందులో 89900 మంది మెయిన్స్ పరీక్ష కు అర్హత సాధించారు.

2024 జూన్  నెలలోనే మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సివుంది కాగా , షెడ్యూల్ ను వెబ్ నోట్ ద్వారా ప్రకటించినప్పటికీ ఆ తర్వాత కాలంలో ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం ,చైర్మన్ పదవి ఖాళీగా వుండడం తో మరియు ఇతర కారణాలతో మెయిన్స్ పరీక్ష ను వాయిదా వేయడం జరిగింది.

ఇటీవల కొత్త ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా మాజీ  ఐపీఎస్   అధికారిణి AR అనురాధ గారు బాధ్యతలు చేపట్టడంతో ఏపీపీఎస్సీ వారు పెండింగ్ విషయాలపై మళ్ళీ దృష్టి సారించారు.

ఇందులో మొదటిగా తేది :30/10/2024 న విడుదల చేసిన వెబ్ నోట్ ద్వారా ఏపీపీఎస్సీ గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్ష తేది ను జనవరి 05 /2025 న నిర్వహించనున్నట్లు తెలిపింది. 

అయితే అభ్యర్థుల అనేక విజ్ఞప్తుల మేరకు పరీక్ష ను మరొకసారి రీషెడ్యూల్ చేసి , 2025 ఫిబ్రవరి 23 వ తారీఖున పరిక్ష న నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఇటీవలే బడ్జెట్ ప్రవేశపెట్టడం ,మరియు అభ్యర్థులకు కొన్ని సబ్జెక్టులకు సంబంధించి సరైన మెటీరియల్ అందుబాటులో  లేకపోవడం వంటి అనేక కారణాల చేత అభ్యర్థులకు ఈ సమయం పెంపు అన్నది చాలా కలిసొచ్చే అంశం గా చెప్పవచ్చు.

గ్రూప్ – 2 మెయిన్స్  పరీక్ష  ఆఫ్లైన్ విధానం లో నిర్వహిస్తారు.

మెయిన్స్ పరీక్ష లో మొత్తం 2 పేపర్లు వుంటాయి.

మొత్తం 300 మార్కులకు గాను నిర్వహించే ఈ పరీక్ష లో  

  • పేపర్ -1 లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు భారత దేశం రాజ్యాంగం సబ్జెక్టులు
  • పేపర్ – 2 లో సైన్స్ అండ్ టెక్నాలజీ & భారత , ఆంధ్రప్రదేశ్  ఎకానమీ సబ్జెక్టులు వుంటాయి.
  • అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో వుంటాయి.
  • ⅓ వంతు నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు.

అభ్యర్థులు ,దొరికిన ఈ అదనపు  సమయాన్ని  సద్వినియోగం చేసుకొని మరింత కట్టుదిట్టంగా ప్రిపేర్ అయి ఈ ఉద్యోగాలను సాధిస్తారు అని ఆశిస్తూ……

  • గ్రూప్ – 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అందరికీ INB jobs info నుండి ALL THE BEST
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *