ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అమలుకు రంగం సిద్ధం అయ్యింది. ఇప్పటికే G.O విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. అయితే ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉన్నామా ? లేదా ? ఈ పథకం యొక్క స్టేటస్ ఎలా తెలుసుకోవాలి? అలానే SC కేటగిరీ కి చెందిన విద్యార్థులకు సంబంధించి అమౌంట్ ఎవరికి క్రెడిట్ అవుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేసింది వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 WhatsApp లో తల్లికి వందనం పథకం స్టేటస్ చెక్ చేసే విధానం :
- తల్లికి వందనం పథకం కి సంబంధించి లబ్ధిదారులు స్టేటస్ చెక్ చేసుకొనేందుకు గాను అవకాశం ఇచ్చారు.
- ఇందుకు గాను మన మిత్ర వాట్సాప్ సర్వీసులో భాగంగా అవకాశం కల్పించారు.
- ముందుగా మన మిత్ర వాట్సాప్ సర్వీస్ నంబర్ 9552300009 ను సేవ్ చేసుకొని , Hai అని మెసేజ్ చేయాలి. ఆ తర్వాత సిటిజన్ సర్వీసెస్ నుండి Thalliki Vandhanam status అనే టాబ్ పై క్లిక్ చేయవలసి వుంటుంది.
- ఆ తర్వాత తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి , సబ్మిట్ చేయగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
🔥తల్లికి వందనం కొరకు ఇంటర్మీడియట్ SC విద్యార్థులు NPCI లింక్ చేసుకోగలరు :
- తల్లికి వందనం పథకం కి సంబంధించి , SC విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్ తెలియచేసింది. వీరికి కేంద్ర ప్రభుత్వ వాటాను విద్యార్థి యొక్క అకౌంట్ కి జమ చేయనున్నారు.
- వీరికి సంబంధించి బ్యాంకు అకౌంట్ లేకపోతే వారు తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పటికే అకౌంట్ కలిగి వున్న వారు NPCI లింక్ చేసుకోవాలి.
- ఈ అంశానికి సంబంధించి , విద్యార్థుల జాబితా ఇప్పటికే గ్రామ, వార్డ్ సచివాలయం లలో అందుబాటులో ఉన్నాయి కావున లబ్ధిదారులు సచివాలయం లను సంప్రదించి, సమాచారం తెలుసుకోగలరు.
🏹 తల్లికి వందనం పథకం డబ్బులు రావాలి అంటే ఇలా చేయండి – Click here
🔥తల్లికి వందనం పథకం గ్రీవెన్స్ రైస్ చేయు విధానం:
- తల్లికి వందనం పథకం కి సంబంధించి , గ్రీవెన్స్ రైస్ చేసుకొనేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.
- అర్హత కలిగి ఉండి , అనర్హుల జాబితాలో లబ్ధిదారులు ఉంటే వారు గ్రామ వార్డు సచివాలయం లో గల డిజిటల్ అసిస్టెంట్ / వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వారు లాగిన్ లో గ్రీవెన్స్ రైస్ చేసేందుకు అవకాశం కల్పించారు.
- ఈ నెల 20వ తేదీ లోగా గ్రీవెన్స్ రైస్ చేసేందుకు అవకాశం కల్పించారు.