రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. అయితే ఇందులో భాగంగా కొంత మంది పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు గాను ఉన్న అవకాశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.
Andhra Pradesh Free Bus Scheme Details :
ఈ అంశానికి సంబంధించి కీలక అప్డేట్ లభిస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం (AP Free Bus Scheme) :
- సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా హామీ ఇచ్చిన మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పథకం ను ఆగస్టు 15వ తేదీ నుండి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి గారు తెలియచేయడం జరిగింది.
- ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజులలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఇందులో భాగంగా వీరందరికీ కూడా ఉచిత బస్సు పాసులు కల్పించాలి అని ప్రభుత్వం భావిస్తుంది.
🏹 ఏపీలో రేషన్ తీసుకోకపోతే నగదు బదిలీ చేయనున్న ప్రభుత్వం – Click here
🔥తీవ్ర అనారోగ్యం తో బాధ పడుతున్న పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం ! :
- రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం లో మహిళలతో పాటు కొంత మంది పురుషులకు కూడా అవకాశం కల్పించాలి అని భావిస్తుంది అని సమాచారం.
- మహిళలతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు పొందుతున్న పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం..
- ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి , మహిళలతో పాటు వీరికి కూడా ఉచిత పాస్ లను అందించాలని భావిస్తుంది.
- ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.