తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీలు చెప్పేసిన ముఖ్యమంత్రి | Thalliki Vandanam, Annadata Sukhi Bhava, Free Bus for Womens Schemes Dates

Thalliki Vandanam, Annadata Sukhi Bhava, Free Bus for Womens Schemes Dates
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానాడు కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఇందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ అంశాల గురించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో భాగంగా వివిధ సంక్షేమ పథకాల యొక్క వివరాలు మరియు అమలు చేయి విధానం , తేదీలను కూడా ప్రకటించడం విశిష్టత సంతరించుకుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహానాడు కార్యక్రమంలో ప్రకటించిన వాటిలో తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రధానంగా ఉన్నాయి.

  • ముఖ్యమంత్రి గారు ప్రస్తావించిన ఈ పథకాల వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 మరికొద్ది రోజులలో రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా లబ్ధి :

  • మహానాడు కార్యక్రమం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకం అమలు అంశం పై కీలక వాఖ్యలు చేశారు.
  • అన్నదాత సుఖీభవ పథకాన్ని సంవత్సరానికి గాను  మూడు విడతల్లో రైతులకు పెట్టుబడి సహాయంగా అందచేస్తాం అని తెలియచేసారు.
  • అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకం అయిన పీఎం కిసాన్ యోజన పథకానికి అనుసంధానంగా కలిపి అమలు చేస్తామని, పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000/- రూపాయలు తో పాటు రాష్ట్ర ప్రభుత్వం 14,000/- రూపాయలు కలిపి మొత్తం 20,000/- రూపాయలు మూడు విడతల్లో అందచేయనున్నారు.
  • కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తొలి విడత ను విడుదల చేసే రోజునే రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.

ఏపీలో జూన్ 1 నుండి రేషన్ షాపు టైమింగ్స్ ఇవే – Click here 

🔥 ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ముఖ్యమంత్రి పునరుద్ఘాటన : 

  • ఇదే మహానాడు వేదికగా ముఖ్యమంత్రి వర్యులు సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మరో పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా ప్రస్తావించారు.
  • మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని, ఇందులో భాగంగానే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించి ఆగస్టు 15 వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు.
  • ఇప్పటికే ఈ పథకం అమలులో ఉన్న రాష్ట్రాలలో మంత్రుల బృందం పర్యటించడం , పథకం అమలు కొరకు నిర్దిష్ట ప్రణాళిక రూపొందించడం జరిగాయి.

🔥 స్కూల్ ప్రారంభానికి ముందే తల్లికి వందనం :

  • గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి 15,000/- రూపాయల చొప్పున లబ్ది చేకూరేలా తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు తెలియచేసారు.
  • ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేశామని, తల్లికి వందనం పథకం కూడా వచ్చే నెల లోపుగా అమలు చేసి, అర్హులు అయిన తల్లులకు వారి  అకౌంట్లలో డబ్బులు విడుదల చేస్తామని పేర్కొన్నారు.
  • ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!