ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో అన్నదాత సుఖీభవ పథకం అమలు కాబోతుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.
గ్రామ సచివాలయంలో గల రైతు సేవా కేంద్రం వద్ద గల సిబ్బంది అన్నదాత సుఖీభవ పథకం కొరకు రైతులను రిజిస్టర్ చేసి ఉన్నారు.
అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ ( Annadhata Sukhibava ) :
అయితే ఈ పథకానికి సంబంధించి Application Status తెలుసుకొనేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పోర్టల్ లో అవకాశం కల్పించింది.
ప్రజలు అన్నదాత సుఖీభవ పథకం యొక్క స్టేటస్ ను ఏ విధంగా తెలుసుకోవాలి అనే అంశాన్ని ఈ ఆర్టికల్ లో తెలియచేయడం జరిగింది.
🔥 మరికొద్ది రోజులలో అన్నదాత సుఖీభవ పథకం అమలు :
- రాష్ట్రంలో రైతుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం అయిన పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుంది.
- ఈ పథకాన్ని అమలు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
ప్రతిరోజు ఇలాంటి పథకాలు వివరాలు మీ మొబైల్ లోకి రావాలి అంటే మా వాట్సాప్ గ్రూప్ లో ఉచితంగా వెంటనే జాయిన్ అయిపోండి.
- ఈ పథకం ద్వారా పీఎం కిసాన్ తో సంయుక్తంగా 20,000 రూపాయలు రైతులకు లబ్ది చేకూరనుంది.
- గతంలో ఉన్న కనీస భూ పరిమితి ను కూడా తొలగించి , ప్రస్తుతం రైతుల తో పాటు , కౌలు రైతులకు కూడా ఈ పథకం అమలు చేస్తున్నారు.
✅ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదా ? అయితే ఇలా చేయండి – Click here
🔥అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకోండి ఇలా ? :

- రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం యొక్క దరఖాస్తు స్టేటస్ (Annadhata Sukhibava Scheme Application status) ను తెలుసుకొనేందుకు గాను అవకాశం కల్పించింది.
- ముందుగా అధికారిక వెబ్సైట్ అయిన అన్నదాత సుఖీభవ వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి.
- వెబ్సైట్ లో Check status అనే లింక్ పై క్లిక్ చేస్తే.. వెబ్సైట్ Redirect అయి అప్లికేషన్ స్టేటస్ పేజీ ఓపెన్ అవుతుంది.
- అక్కడ లబ్ధిదారుల యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి , క్యాచ్ ఎంటర్ చేయాలి.
- పై డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే లబ్ధిదారుని పేరు , ఖాతా నెంబర్ , అప్లికేషన్ వెరిఫై అయ్యింది లేనిది వంటి వివరాలు చూపిస్తాయి.
- లబ్ది దారులు పై విధంగా చెక్ చేసుకొని, దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.