భారతదేశం లోనే అతి పురాతనమైన & అతి ప్రధానమైన పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినటువంటి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ (NICL) లిమిటెడ్ సంస్థ నుండి 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు మన తెలుగు రాష్ట్రాల్లో పని చేసుకునే అవకాశం కూడా పొందవచ్చు.
ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు Online విధానంలో అప్లై చేయాలి. అక్టోబర్ 24 నుండి నవంబర్ 11 వరకు అప్లై చేయవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. అలానే మరిన్ని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు , ప్రైవేటు జాబ్ అప్డేట్స్ కోసం ఈ పేజ్ ను ఫాలో అవ్వండి.
🏹 ShareChat లో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 500
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో 21 ,తెలంగాణ రాష్ట్రంలో 12 ఖాళీలు కలవు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
అసిస్టెంట్ ఉద్యోగాలను ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు.
🔥 విద్యార్హత :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగం లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వుండాలి.
- తేది 01/10/2024 నాటికి కచ్చితంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వుండాలి.
- అభ్యర్థి ఏ రాష్ట్ర పరిధిలో గల ఖాళీలకు అప్లై చేస్తారో ఆ రాష్ట్ర భాష చదవడం , రాయడం , మాట్లాడడం వచ్చి వుండాలి.
🔥 వయస్సు :
- దరఖాస్తు చేసుకోవలసిన అభ్యర్థులు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలవారై వుండాలి.
- వయస్సు నిర్ధారణకి 01/10/2024 కట్ ఆఫ్ తెదిగా నిర్ణయించారు.
- దరఖాస్తుదారులు తేది 02/10/1994 నుండి తేది 01/10/2023 లోపుగా జన్మించిన వారు అర్హులు.
- ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు & ఓబీసీ వారికి 3 సంవత్సరాలు PwBD వారికి 10 సంవత్సరాలు వయో పరిమితి కలదు.
🏹 NMDC లో ఉద్యోగాలు – Click here
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రీజియన్ లలో ఒకే సారి రిక్రూట్మెంట్ జరిపి ,ఒకే సారి పరిక్ష నిర్వహిస్తారు కావున అభ్యర్థులు ఏదో ఒక రీజియన్ కి మాత్రమే అప్లై చేసుకోగలరు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఎస్సీ , ఎస్టీ , PwBD , ex సర్వీస్ మాన్ వారు 100 రూపాయలు
- మిగతా అభ్యర్థులు 850 /- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
🔥 జీతం :
- 39,000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులు కి ఆన్లైన్ ప్రిలిమినరీ & మెయిన్స్ నిర్వహించి ,స్థానిక భాషా పరీక్ష కి షార్ట్ లిస్ట్ చేస్తారు.
- ప్రిలిమినరీ & మెయిన్స్ పరీక్ష లో ఇంగ్లీష్ , రీజనింగ్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ , న్యూమరికల్ ఎబిలిటీ , జనరల్ అవేర్నెస్ , కంప్యూటర్ నాలెడ్జ్ వంటి సబ్జెక్టులు వుంటాయి.
- ప్రిలిమ్స్ పరీక్ష 100 మార్కులకు గాను , మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు గాను నిర్వహిస్తారు.
🔥 పరీక్ష కేంద్రాలు :
దేశం లోని పలు ముఖ్య పట్టణాల తో పాటు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ , విజయవాడ, విశాఖపట్నం లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది : 24/10/2024
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది : 11/11/2/024
- ఫేజ్ -1 ఆన్లైన్ ఎగ్జామ్ తేది : 30/11/2024
- ఫేజ్ -2 ఆన్లైన్ ఎగ్జామ్ తేది: 28/12/2024
👉 Click here for official website