ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు ముగిశాయి.. పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముఖ్యమైన ప్రకటన చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు ఇస్తున్నారు. దీనికోసం విద్యార్థులు తమ దగ్గర ఉన్న పాత బస్సు పాసులు మార్చుకొని కొత్త పాసులు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 13వ తేదీ నుంచి ప్రారంభమైనది.
ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జారీ చేస్తున్న నెల, మూడు నెలలు, సంవత్సరం కాలానికి బస్సు పాసులు తీసుకువచ్చని తెలిపారు.
బస్సు పాసుల కోసం దరఖాస్తు విధానం :
విద్యార్థులు బస్సు పాస్ ల కోసం https://www.apsrtconline.in/oprs-web/guest/home.do?h=1 అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కూల్ విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేత దరఖాస్తు ఫారం పైన సంతకం చేయించాలి. దరఖాస్తు ఫారం తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మరియు విద్యార్థి ఫోటో తీసుకుని ఆర్టీసీ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ నెల వరకు బస్సు పాసులు జారీ చేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
🏹 Officil Website – Click here